ఖమ్మం ఆగష్టు 11
(పున్నమి న్యూస్)
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఖమ్మం నగర శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని పలు కళాశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఏబీవీపీ సభ్యత్వాన్ని స్వీకరించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం, విద్యారంగ అభివృద్ధి, దేశభక్తి, సామాజిక బాధ్యత వంటి అంశాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఏబీవీపీ నిరంతరం కృషి చేస్తుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.



