భూపాలపల్లి జూలై 18 (పున్నమి న్యూస్ ప్రతినిధి): హనుమకొండలో రాష్ట్ర ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ హరి చందన దాసరి ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ–2026పై ఐదు జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఓటరును జాబితాలో చేర్చేందుకు ఇంటింటి సర్వే, డిజిటలైజేషన్, ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. బీఎల్వోల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ రాజకీయ పార్టీలు, మీడియాతో సమన్వయం కొనసాగించాలని తెలిపారు. సమావేశంలో హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లతో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు.

ఓటరు జాబితా సవరణపై ఐదు జిల్లాల అధికారులతో సమీక్ష
భూపాలపల్లి జూలై 18 (పున్నమి న్యూస్ ప్రతినిధి): హనుమకొండలో రాష్ట్ర ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ హరి చందన దాసరి ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ–2026పై ఐదు జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఓటరును జాబితాలో చేర్చేందుకు ఇంటింటి సర్వే, డిజిటలైజేషన్, ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. బీఎల్వోల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ రాజకీయ పార్టీలు, మీడియాతో సమన్వయం కొనసాగించాలని తెలిపారు. సమావేశంలో హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లతో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు.

