నందిపేట్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఏడు ఫిర్యాదులు అందాయి. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ అర్జీలను ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్ అశోక్ కు అందజేశారు. ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ నుండి రెండు ఫిర్యాదులు, రెవెన్యూ శాఖ నుండి ఒకటి, హౌసింగ్ శాఖ నుండి నాలుగు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.



