శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో 5.o9.2026 న ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని డిగ్రీ మరియు Jr. కళాశాల Student Union కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం SDMSMK కళాశాల ప్రాంగణంలో జరిగింది.
ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ Dr. P.V. దుర్గావతి, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ Dr. S. పద్మజ పలువురు అధ్యాపకులు మరియు విద్యార్థినిలు పాల్గొన్నారు.
కళాశాలలో 25 సంవత్సరాల సుదీర్ఘ సేవను పూర్తి చేసిన అధ్యాపకులను ఈ కార్యక్రమంలో సన్మానించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి, కళాశాల అభివృద్ధికి ఉపాధ్యాయులు అందించిన సేవలను కొనియాడారు. వారి అంతులేని సేవలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి, ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం అనంతరం ఉపాధ్యాయులకు భోజన కార్యక్రమం నిర్వహించారు.
ఈ ఉపాధ్యాయుల వేడుకలో విద్యార్థులు, అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొని ఆనందోత్సాహాలతో ఉపాధ్యాయ దినోత్సవాన్ని విజయవంతంగా జరిపారు.






