జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా మన వారసత్వ సంపద అయిన అడవులు, వన్యప్రాణులు, ప్రకృతి సంపదల పరిరక్షణ కోసం అత్యున్నత త్యాగాలు చేసిన అటవీ శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. వారి ధైర్యసాహసాలు, అంకిత భావం, అడవుల పరిరక్షణ పట్ల నిబద్ధత తరతరాలకు స్ఫూర్తినిస్తాయి. 1939 నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కు చెందిన 24 మంది అటవీ సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేశారు. కూటమి ప్రభుత్వంలో సంజీవిని పేరిట కార్పస్ ఫండ్ తీసుకువచ్చి, అమరవీరుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నాము. ప్రతి త్యాగాన్ని స్మరించుకుంటూ, ప్రతి వీరుడిని గౌరవించుకుంటూ, వారి స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్తాము.

*అమర వీరుల త్యాగ ఫలాలను భావి తరాలకు అందించడం మన బాధ్యత
జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా మన వారసత్వ సంపద అయిన అడవులు, వన్యప్రాణులు, ప్రకృతి సంపదల పరిరక్షణ కోసం అత్యున్నత త్యాగాలు చేసిన అటవీ శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. వారి ధైర్యసాహసాలు, అంకిత భావం, అడవుల పరిరక్షణ పట్ల నిబద్ధత తరతరాలకు స్ఫూర్తినిస్తాయి. 1939 నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కు చెందిన 24 మంది అటవీ సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేశారు. కూటమి ప్రభుత్వంలో సంజీవిని పేరిట కార్పస్ ఫండ్ తీసుకువచ్చి, అమరవీరుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నాము. ప్రతి త్యాగాన్ని స్మరించుకుంటూ, ప్రతి వీరుడిని గౌరవించుకుంటూ, వారి స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్తాము.

