ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 9 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో కోదండరామస్వామి ఆలయం నిర్మాణానికి ఐదేళ్లు పూర్తైన సందర్భంగా సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సీతారాముల ఆశీస్సులు ప్రజలకు, కూటమి ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉభయకర్తలుగా చిట్టమూరు నరసారెడ్డి, చిట్టమూరు శ్రీనివాసులు రెడ్డి వ్యవహరించారు. గ్రామోత్సవంలో కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో టిడిపి నాయకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అక్కంపేటలో వైభవంగా సీతారాముల కళ్యాణం
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 9 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో కోదండరామస్వామి ఆలయం నిర్మాణానికి ఐదేళ్లు పూర్తైన సందర్భంగా సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సీతారాముల ఆశీస్సులు ప్రజలకు, కూటమి ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉభయకర్తలుగా చిట్టమూరు నరసారెడ్డి, చిట్టమూరు శ్రీనివాసులు రెడ్డి వ్యవహరించారు. గ్రామోత్సవంలో కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో టిడిపి నాయకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

