Saturday, 30 May 2026
  • Home  
  • హయత్నగర్ తెలంగాణ మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో 100% ఉత్తీర్ణత, 10వ తరగతి ఫలితాలలో 566 మార్కులతో టాపర్లుగా నిలిచిన దూపం చరణ్
- రంగారెడ్డి

హయత్నగర్ తెలంగాణ మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో 100% ఉత్తీర్ణత, 10వ తరగతి ఫలితాలలో 566 మార్కులతో టాపర్లుగా నిలిచిన దూపం చరణ్

10వ తరగతి ఫలితాలలో 566 మార్కులతో టాపర్లుగా నిలిచిన దూపం చరణ్ పున్నమి: హయత్ నగర్ మండలం: పదవ తరగతి పరీక్ష ఫలితాలలో హయత్ నగర్ లోని కుంట్లూర్ తెలంగాణ మైనార్టీ గురుకుల బాలుర పాఠశాల విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించి, విశేష ప్రతిభ కనబరిచారని, అన్ని సబ్జెక్టుల్లో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం పాఠశాలకు గర్వకారణమని ప్రిన్సిపల్ నిర్మల తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు నరేంద్ర, నరసింహ, అన్నపూర్ణ, అనిత, నస్రీన్ బేగం విద్యార్థులను అభినందిస్తూ, వారి కృషి, పట్టుదల ఫలితమే ఈ విజయమని అన్నారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు దూపం చరణ్ 566, పి. రాకేష్ 552, ఎం. కార్తిక్ 551, షేక్ రిజ్వాన్ 550, డేవిడ్ ఇమ్మాన్యుయేల్ 543, ఎండీ ముబీన్ 505, ఎం. సోఫియాన్ 504, కె. తనూజ్ 503 సాధించారు. 2026-27 విద్యా సంవత్సరానికి ఐదో తరగతి నుండి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధ, జైన్ మైనార్టీ కమ్యూనిటీలకు చెందిన విద్యార్థులకు ఉచిత అడ్మిషన్లు అందుబాటులో ఉన్నాయని, అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ నిర్మల తెలిపారు.

10వ తరగతి ఫలితాలలో 566 మార్కులతో టాపర్లుగా నిలిచిన దూపం చరణ్

పున్నమి: హయత్ నగర్ మండలం: పదవ తరగతి పరీక్ష ఫలితాలలో హయత్ నగర్ లోని కుంట్లూర్ తెలంగాణ మైనార్టీ గురుకుల బాలుర పాఠశాల విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించి, విశేష ప్రతిభ కనబరిచారని, అన్ని సబ్జెక్టుల్లో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం పాఠశాలకు గర్వకారణమని ప్రిన్సిపల్ నిర్మల తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు నరేంద్ర, నరసింహ, అన్నపూర్ణ, అనిత, నస్రీన్ బేగం విద్యార్థులను అభినందిస్తూ, వారి కృషి, పట్టుదల ఫలితమే ఈ విజయమని అన్నారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు దూపం చరణ్ 566, పి. రాకేష్ 552, ఎం. కార్తిక్ 551, షేక్ రిజ్వాన్ 550, డేవిడ్ ఇమ్మాన్యుయేల్ 543, ఎండీ ముబీన్ 505, ఎం. సోఫియాన్ 504, కె. తనూజ్ 503 సాధించారు. 2026-27 విద్యా సంవత్సరానికి ఐదో తరగతి నుండి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధ, జైన్ మైనార్టీ కమ్యూనిటీలకు చెందిన విద్యార్థులకు ఉచిత అడ్మిషన్లు అందుబాటులో ఉన్నాయని, అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ నిర్మల తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.