సోషల్ మీడియా ముసుగులో విద్వేషాలు, అబద్ధాలు ప్రచారం చేసేవారికి ఇక కాలం చెల్లింది..!! 🛑
ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం, మార్ఫింగ్ వీడియోలతో వ్యక్తిగత దూషణలకు దిగడం..
దేవుళ్లు – దేవతలను అవమానిస్తూ మతవిద్వేషాలు రేపడం, మరియు దేశ భద్రత, సమగ్రతకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది..!!
ఈ రకమైన తప్పుడు ప్రచారాలను అణచివేయడానికి డైనమిక్ ఐపీఎస్ అధికారి శ్రీ ఆకె రవి కృష్ణ గారి నేతృత్వంలో ఒక “స్పెషల్ టాస్క్ ఫోర్స్” (Special Task Force) ను ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ ప్రత్యేక బృందం నేరుగా గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ Pawan Kalyan గారి పర్యవేక్షణలో పనిచేస్తూ వారికి రిపోర్టింగ్ చేయనుంది..!!
ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ప్రధాన లక్ష్యాలు :
❌ ఫేక్ న్యూస్, మార్ఫింగ్ వీడియోల నియంత్రణ.
❌ క్యారెక్టర్ అస్సాసినేషన్, వ్యక్తిగత దూషణలపై కఠిన చర్యలు.
❌ మత భావాలను దెబ్బతీసేలా దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసేవారిపై ఉక్కుపాదం.
❌ దేశ భద్రత, సమగ్రతకు ముప్పు వాటిల్లకుండా కఠిన నిఘా.
సోషల్ మీడియాను ఒక ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన వేదికగా మార్చేందుకు, సమాజంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుంది.
ఇలాంటి విప్లవాత్మకమైన అడుగు వేసిన గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఈ బాధ్యతను స్వీకరించిన ఐపీఎస్ అధికారి శ్రీ ఆకె రవి కృష్ణ గారికి హృదయపూర్వక అభినందనలు..!! 🤝


