*వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఐక్యతే పార్టీ బలం!*
*కార్యకర్తకు గుర్తింపు.. ప్రతి అడుగులో అండ!*
ఇబ్రహీంపట్నం :-
ది.16/09/26
*వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) శ్రేణులను మరింత బలోపేతం చేయడం, క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక గుర్తింపు కల్పించడమే లక్ష్యంగా ఈ రోజు ఇబ్రహీంపట్నం లోని మైలవరం నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కొండపల్లి మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్,26వ వార్డు కౌన్సిలర్ శ్రీ గుంజ శ్రీనివాస్ గారి వైఎస్ఆర్సిపి ప్రత్యేక ఐడీ కార్డును అందజేసిన మాజీమంత్రి వర్యులు,మైలవరం నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ జోగి రమేష్ గారు.*
*ఈ సందర్భంగా జోగి రమేష్ గారు మాట్లాడుతు కార్యకర్తలే పార్టీకి బలమైన పునాది అని, వారి సేవలను గుర్తిస్తూ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు గుర్తింపు, గౌరవం, భరోసా కల్పించడమే వైఎస్ఆర్సిపి లక్ష్యం అని పేర్కొన్నారు.*



