కొమ్మి గ్రామ యువత ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి పూజా కార్యక్రమంలోగ్రామ ప్రజలు, ఉత్సవ కమిటీ సభ్యులు, టీడీపీ నాయకులతో కలిసి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చెరుకూరి నవీన్ గారి ఇంటి నుండి స్వామివారికి పొంగళ్లను సమర్పించారు.
విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఆనందంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ మండల అధ్యక్షులు, కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ అధినేత చెరుకూరి వెంకటాద్రి నాయుడు గారు కొమ్మి గ్రామ కమిటీ అధ్యక్షులు దేవినేని వెంకటసుబ్బయ్య బూత్ ఇంచార్జీ చెరుకూరి శేషయ్య వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు చెరుకూరి వెంకయ్య నాయుడు, అంబటి శ్రీను, దేవినేని కృష్ణమోహన్ చౌదరి, చెరుకూరి వెంకటేశు, అంబటి రామానాయుడు, చెరుకూరి వినోద్, చెరుకూరి కృష్ణ తదితర గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




