పెద్దపల్లి/మంథని, ఆగస్టు 28:
రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని శుక్రవారం మంథని పట్టణంలోని శ్రీ మంత్రపురి రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహించి, భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఆలయ అభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయానికి గోముఖం, సౌండ్ సిస్టమ్ అందజేసిన దాతలకు ఈ సందర్భంగా కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. భక్తులు, దాతల సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.



