మధురకవి జాన్ శతజయంతి సదస్సు ఈనెల 12న
మధురకవి మల్లవరపు జాన్ శతజయంతి సందర్భంగా ఈ నెల 12న కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ప్రత్యేక సాహిత్య సదస్సు నిర్వహించనున్నట్లు డాక్టర్ బి. జవహర్ తెలిపారు. చీమకుర్తిలో పోస్టర్ ఆవిష్కరించిన ఆయన, జాన్ తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానం సంపాదించుకున్న కవిగా కొనియాడారు. సదస్సులో విశ్వవిద్యాలయ ఆచార్యులు, పరిశోధకులు, సాహిత్యవేత్తలు పాల్గొని జాన్ పద్యకవిత్వం, సాహిత్య సేవలు, తెలుగు సాహిత్యంపై ఆయన ప్రభావంపై ఉపన్యాసాలు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా యువతకు తెలుగు సాహిత్యంపై అవగాహన పెరిగి, జాన్ సాహిత్య వారసత్వం కొత్త తరాలకు చేరువవుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు..

మధురకవి జాన్ శతజయంతి సదస్సు ఈనెల 12న
మధురకవి జాన్ శతజయంతి సదస్సు ఈనెల 12న మధురకవి మల్లవరపు జాన్ శతజయంతి సందర్భంగా ఈ నెల 12న కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ప్రత్యేక సాహిత్య సదస్సు నిర్వహించనున్నట్లు డాక్టర్ బి. జవహర్ తెలిపారు. చీమకుర్తిలో పోస్టర్ ఆవిష్కరించిన ఆయన, జాన్ తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానం సంపాదించుకున్న కవిగా కొనియాడారు. సదస్సులో విశ్వవిద్యాలయ ఆచార్యులు, పరిశోధకులు, సాహిత్యవేత్తలు పాల్గొని జాన్ పద్యకవిత్వం, సాహిత్య సేవలు, తెలుగు సాహిత్యంపై ఆయన ప్రభావంపై ఉపన్యాసాలు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా యువతకు తెలుగు సాహిత్యంపై అవగాహన పెరిగి, జాన్ సాహిత్య వారసత్వం కొత్త తరాలకు చేరువవుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు..

