పున్నమి న్యూస్ జులై 5 (రేగొండ ): భూపాలపల్లి రేగొండ మండలం మడతపల్లి గ్రామంలో *శ్రీ సీతా రామలింగేశ్వర స్వామి ఆలయ భూమి పూజ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే *గండ్ర సత్యనారాయణ రావు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఆలయాలు ఆధ్యాత్మికతకు, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలని పేర్కొన్నారు. ప్రతి రోజు నిత్య పూజలు, అభిషేకాలు, ప్రసాదాల పంపిణీ వంటి ధార్మిక కార్యక్రమాలు నిరంతరాయంగా నిర్వహిస్తూ భక్తులందరూ ఆలయ కట్టడానికి,అభివృద్ధికి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గుతోజు కిష్టయ్య గారు, మండల పార్టీ అధ్యక్షులు, మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, పండితులు మరియు భక్తులు పాల్గొన్నారు.



