భైంసాలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే శ్రీ పవార్ రామారావు పటేల్ గారు పాల్గొన్నారు.జాతీయ జెండాను చేతబట్టి ర్యాలీలో పాల్గొన్న ఆయన దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటిచెప్పారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు.
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు జాతీయ జెండా ఔన్నత్యాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. యువత పెద్ద సంఖ్యలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,విద్యార్థులు నాయకులు, కార్యకర్తలు, యువత తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ జెండాలతో నిర్వహించిన ర్యాలీ దేశభక్తి నినాదాలతో ఉత్సాహంగా సాగింది.


