మయన్మార్ అధ్యక్షుడు మిన్ ఆంగ్ హ్లైంగ్ భారత పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో కీలక చర్చలు జరిపారు. భారత్ భద్రతకు ముప్పుగా ఉన్న శక్తులు తమ భూభాగాన్ని ఉపయోగించకుండా చర్యలు తీసుకుంటామని మయన్మార్ అధ్యక్షుడు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య భద్రతా సహకారం, సరిహద్దు భద్రత, మౌలిక వసతుల ప్రాజెక్టులు, రక్షణ రంగ సహకారంపై చర్చించారు. మయన్మార్లో కొనసాగుతున్న అంతర్గత సంక్షోభాన్ని సంభాషణల ద్వారా పరిష్కరించాలని భారత్ అభిప్రాయపడింది. ఈ సమావేశంలో ఈశాన్య భారత తిరుగుబాటు గ్రూపులు, సైబర్ నేర కేంద్రాలు, కీలక ఖనిజ వనరుల అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి.

భారత్కు వ్యతిరేక కార్యకలాపాలకు మయన్మార్ భూభాగాన్ని వినియోగించనివ్వం
మయన్మార్ అధ్యక్షుడు మిన్ ఆంగ్ హ్లైంగ్ భారత పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో కీలక చర్చలు జరిపారు. భారత్ భద్రతకు ముప్పుగా ఉన్న శక్తులు తమ భూభాగాన్ని ఉపయోగించకుండా చర్యలు తీసుకుంటామని మయన్మార్ అధ్యక్షుడు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య భద్రతా సహకారం, సరిహద్దు భద్రత, మౌలిక వసతుల ప్రాజెక్టులు, రక్షణ రంగ సహకారంపై చర్చించారు. మయన్మార్లో కొనసాగుతున్న అంతర్గత సంక్షోభాన్ని సంభాషణల ద్వారా పరిష్కరించాలని భారత్ అభిప్రాయపడింది. ఈ సమావేశంలో ఈశాన్య భారత తిరుగుబాటు గ్రూపులు, సైబర్ నేర కేంద్రాలు, కీలక ఖనిజ వనరుల అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి.

