ఖమ్మం జులై
(పున్నమి ప్రతినిధి)
ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు అధ్యక్షతన, ఖమ్మం జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు రేఖ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎండోమెంట్ బోర్డు సభ్యురాలు, బీసీ మహిళ ఈశ్వరమ్మ యాదవ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన శివచరణ్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్వాల నరసింహారావు గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకులు బీసీలను అణిచివేసే ధోరణిని అవలంబిస్తే బీజేపీ సహించబోదని హెచ్చరించారు. రానున్న రోజుల్లో బీసీలను మరింత సంఘటితం చేసే దిశగా ఓబీసీ మోర్చా పనిచేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మందా సరస్వతి, ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ, ప్రధాన కార్యదర్శి రుద్రగాని మాధవరావు, ఖమ్మం అర్బన్ అధ్యక్షులు వాకాదాని రామకృష్ణ, రఘునాథపాలెం అధ్యక్షులు గుత్తా వంశీ, పిల్లలమర్రి వెంకట్, వీరభద్రం, జిల్లా ఐటీ సెల్ కన్వీనర్ బోయినపల్లి సురేష్, ఎండోమెంట్ సెల్ జిల్లా కన్వీనర్ మారుతి వీరభద్ర ప్రసాద్, వల్లాల రమేష్ యాదవ్, మణికంఠ, మేడ సంపత్, శ్రీనివాస్ రెడ్డి, రమేష్, అనగాని రామారావు గౌడ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

