ఖమ్మం, జులై 20
(పున్నమి ప్రతినిధి):
భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే సోమవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా అధ్యక్షులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నియామకాలలో భాగంగా ఖమ్మం జిల్లా బీజేవైఎం అధ్యక్షుడిగా శాసనాల సాయిరామ్ నియమితులయ్యారు. పార్టీ బలోపేతం, యువతను పార్టీ సిద్ధాంతాల వైపు ఆకర్షించడం, జిల్లా వ్యాప్తంగా సంస్థాగత కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించే బాధ్యతలను ఆయనకు పార్టీ నాయకత్వం అప్పగించింది.
శాసనాల సాయిరామ్ నియామకంపై బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ఖమ్మం జిల్లాలో బీజేవైఎంను మరింత బలోపేతం చేస్తానని శాసనాల సాయిరామ్ ఈ సందర్భంగా తెలిపారు.



