రాజన్న సిరిసిల్ల జూలై 20 (పున్నమి ప్రతినిధి)
రాజన్న సిరిసిల్ల: జీవో-12ను వెంటనే రద్దు చేసి, 13 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు లేబర్ కార్డులను పునరుద్ధరించాలని, వెల్ఫేర్ బోర్డు నిధులను కార్మికుల సంక్షేమానికే వినియోగించాలని, భూమిలేని నిరుపేద కార్మికులకు ఇంటి స్థలాలు కేటాయించి ప్రభుత్వమే గృహ నిర్మాణం చేపట్టాలని తదితర డిమాండ్లతో సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎగమాటి ఎల్లారెడ్డి, జిల్లా అధ్యక్షుడు గీస బిక్షపతి, జిల్లా సీఐటీయూ సహాయ కార్యదర్శి ఎలిగంటి రాజశేఖర్, జిల్లా కమిటీ సభ్యుడు కోల శ్రీనివాస్, కోశాధికారి శ్రావణపల్లి ప్రభాకర్, గుంటుకు నరేందర్, భవన నిర్మాణ సంఘం సహాయ కార్యదర్శి రాజయ్య, దేవయ్య, కుడుదల నర్సింహులు, రైతు సంఘం అధ్యక్షుడు రామచంద్రం అశోక్, మహిళా నాయకులు బంక లలిత, లక్ష్మి, నరసవ్వ, లతతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా 13 మండలాల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేశారు.


