వరికుంటపాడు మండలం కొండాయపాలెం పంచాయతీ ధర్మవరం గ్రామంలోని సర్వే నంబర్ 148/1లో 3.30 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెట్ల తొలగింపు, భూమి చదును, ఫెన్సింగ్ అనంతరం తాజాగా బోర్వెల్ తవ్వినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు స్పందించడం లేదని గ్రామస్థులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ భూమి ఆక్రమణపై ఇప్పటికే పలు వార్తాపత్రికల్లో కథనాలు వచ్చినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. వెంటనే విచారణ చేపట్టి ప్రభుత్వ భూమిని రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

ప్రభుత్వ భూమి ఆక్రమణపై స్పందించని రెవెన్యూ
వరికుంటపాడు మండలం కొండాయపాలెం పంచాయతీ ధర్మవరం గ్రామంలోని సర్వే నంబర్ 148/1లో 3.30 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెట్ల తొలగింపు, భూమి చదును, ఫెన్సింగ్ అనంతరం తాజాగా బోర్వెల్ తవ్వినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు స్పందించడం లేదని గ్రామస్థులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ భూమి ఆక్రమణపై ఇప్పటికే పలు వార్తాపత్రికల్లో కథనాలు వచ్చినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. వెంటనే విచారణ చేపట్టి ప్రభుత్వ భూమిని రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

