లయన్స్, వాకర్స్ క్లబ్స్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాల నిర్వాహకులు మన్నెం రామమోహన్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా అరవపల్లి ఆర్అండ్బీ బంగ్లా ఆవరణలో పేదలకు అల్పాహార వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వృద్ధులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై అల్పాహారం స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎస్సై మన్నెం రామమోహన్ మాట్లాడుతూ అన్నదానం పుణ్యకార్యమని, అనాథలు, వృద్ధుల ఆకలి తీర్చడం ఎంతో తృప్తినిచ్చే సేవా కార్యక్రమమని అన్నారు. పేదలకు సహాయం చేసే కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి, తమకు తోచిన విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి అండగా నిలవాలని కోరారు.కార్యక్రమంలో డాక్టర్ బచ్చు జయభాస్కరరావు, లయన్ కుర్రా మణియాదవ్, నీటి సంఘం అధ్యక్షుడు భూశెట్టి వెంకటసుబ్బయ్య, మోడపోతుల రాము, గంధం గంగాధర్, మంటి మారయ్య, ముమ్మడిశెట్టి రమేష్, గురుప్రసాద్, కారకుర్తి వెంకటయ్య, కొత్తపల్లి రాజాచారి, గుండు సురేష్, సునీల్రెడ్డి, చామంచి పెంచలయ్య, మట్టి బాబు, మన్నెం దేవి, మన్నెం చరణ్ తదితరులు పాల్గొన్నారు.





