తెలకపల్లి, న్యూస్టుడే: మండల పరిధిలోని పెద్దూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో శుక్రవారం శ్రావణ వరలక్ష్మి వ్రతాలు భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు మారోజు ఉమాపతి ఆచార్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమంలో దాదాపు 50 మంది మహిళలు భక్తిశ్రద్ధలతో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, వ్రతాల అనంతరం అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.

పెద్దూర్ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో శ్రావణ వ్రతాల సందడి
తెలకపల్లి, న్యూస్టుడే: మండల పరిధిలోని పెద్దూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో శుక్రవారం శ్రావణ వరలక్ష్మి వ్రతాలు భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు మారోజు ఉమాపతి ఆచార్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమంలో దాదాపు 50 మంది మహిళలు భక్తిశ్రద్ధలతో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, వ్రతాల అనంతరం అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.

