రోడ్లపై సురక్షితంగా నడిచే హక్కు ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పాదచారుల కోసం ప్రత్యేకంగా గుర్తించిన, సక్రమంగా నిర్వహించే ఫుట్పాత్లు ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. వాహనాల రాకపోకల కంటే పాదచారుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. ఐదేళ్ల బాలుడు ట్రక్కు ఢీకొని మరణించిన కేసులో ఈ తీర్పు వెలువడింది. బాలుడి కుటుంబానికి ₹11 లక్షలకు పైగా పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఫుట్పాత్ల నిర్వహణకు చట్టబద్ధ వ్యవస్థను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

పాదచారుల హక్కు ప్రాథమిక హక్కు: సుప్రీంకోర్టు
రోడ్లపై సురక్షితంగా నడిచే హక్కు ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పాదచారుల కోసం ప్రత్యేకంగా గుర్తించిన, సక్రమంగా నిర్వహించే ఫుట్పాత్లు ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. వాహనాల రాకపోకల కంటే పాదచారుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. ఐదేళ్ల బాలుడు ట్రక్కు ఢీకొని మరణించిన కేసులో ఈ తీర్పు వెలువడింది. బాలుడి కుటుంబానికి ₹11 లక్షలకు పైగా పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఫుట్పాత్ల నిర్వహణకు చట్టబద్ధ వ్యవస్థను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

