పర్యావరణ పరిరక్షనే మా ధ్యేయం.
నేదురు మల్లి జనార్దన్ రెడ్డి గిరిజన కాలనీలో గిరిజనులకు గుడ్డ సంచులు పంపిణీ,
హోమియో మందులు పంపిణీ.
*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 21 వాకాడు మండలం,*
పర్యావరణ పరిరక్షణ ద్యేయంగా
ఎం.వి.రావు.ఫౌండేషన్ పనిచేస్తుందని ఆ ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ అన్నారు.
శుక్రవారం వాకాడు మండలం నేదురు మల్లి జనార్దన్ రెడ్డి గిరిజన కాలనీలో *పర్యావరణ పరిరక్షణ* అనే అంశంపై గిరిజన కాలనీవాసులకు అవగాహన కల్పించారు
చిరంజీవి *ముప్పవరపు చరిష్మా* నూతన వివాహ మహోత్సవ సందర్భంగా ఎం. వి రావు ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి కాలనీలో ఉన్న గిరిజనులకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి విషయమై వారితో అవగాహన ఏర్పాటు చేసి అనంతరం వారికి *గుడ్డ సంచులను* పంపిణీ చేశారు.
-ప్లాస్టిక్ వాడితే జరిగే నష్టాన్ని వివరిస్తూ ప్రతి ఒక్కరూ ఈ గుడ్డ సంచులను ప్రతిరోజు వినియోగించాలని లీలా మోహన్ కృష్ణ గిరిజనులకు వివరించారు.
అనంతరం ప్రస్తుతం అమ్మవారు చికెన్ ఫాక్స్ ఉన్నందువల్ల గిరిజనులందరికి హోమియో మందులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో
ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ, కార్యదర్శి ఎం విజయలక్ష్మి, శ్రీ విద్యా వికాస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పుట్టయ్య, వాకాడు ఆర్టీసీ డిపో కార్మికుడు భాస్కర్, గిరిజన కుటుంబాల వారు పాల్గొన్నారు.



