నెల్లూరు జిల్ల్లా విద్యా టాస్క్ ఫోర్స్ బృందం పాఠశాల సందర్శన
నెల్లూరు జిల్లా సంఘం మండలంతరుణవాయిమోడల్ ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యా టాస్క్ ఫోర్స్ బృంద సభ్యులు శ్రీ *సమీర్* గారు, శ్రీ *హరిబాబు* గారు సందర్శించారు. ఈ సందర్భంగా M.E.O.-2 శ్రీ మల్లయ్య గారు కూడా పాల్గొన్నారు.విద్యార్థుల బోధన–అభ్యసన ప్రక్రియ, పఠన సామర్థ్యాలు, విద్యా ప్రమాణాలు, పాఠశాల రికార్డులు, సంసిద్ధత బుక్స్, వర్క్బుక్లు, సమగ్ర ప్రగతి కార్డులు మరియు మూల్యాంకన పుస్తకాలను పరిశీలించారు.విద్యార్థుల పఠన సామర్థ్యాలు, విద్యా ప్రమాణాలు, అలాగే గైర్హాజరైన విద్యార్థుల కోసం ఉపాధ్యాయులు చేపడుతున్న ఫోన్ ద్వారా సంప్రదింపులు, గృహ సందర్శనల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.విద్యార్థుల అభ్యసన ప్రగతిని మరింత సమర్థవంతంగా నమోదు చేసే దిశగా విలువైన సూచనలు, మార్గదర్శకాలను అందించారు.



