శ్రీ కాళహస్తి, జూన్ 17, (పున్నమి న్యూస్) : నారాయణపురంలో నిర్వహించిన అమ్మవారి జాతర మహోత్సవానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బందిగా పనిచేస్తున్న గుమ్మడిపూడి గోపిరెడ్డి ఆహ్వానం మేరకు జాతరకు విచ్చేసిన ఆయన, గోపిరెడ్డి కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా ముచ్చటించి తమ అనుబంధాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే, నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేశారు. కార్యక్రమంలో టి. మునిచంద్ర, టి. చంద్ర, రాజయ్య, శ్రీధర్, గోపాల్, ముని, బత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

నారాయణపురం జాతరలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సందడి
శ్రీ కాళహస్తి, జూన్ 17, (పున్నమి న్యూస్) : నారాయణపురంలో నిర్వహించిన అమ్మవారి జాతర మహోత్సవానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బందిగా పనిచేస్తున్న గుమ్మడిపూడి గోపిరెడ్డి ఆహ్వానం మేరకు జాతరకు విచ్చేసిన ఆయన, గోపిరెడ్డి కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా ముచ్చటించి తమ అనుబంధాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే, నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేశారు. కార్యక్రమంలో టి. మునిచంద్ర, టి. చంద్ర, రాజయ్య, శ్రీధర్, గోపాల్, ముని, బత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

