శ్రీ కాళహస్తి, సెప్టెంబర్ 02, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని నాగులగుంట వీధిలో నూతనంగా నిర్మించ తలపెట్టిన శ్రీ సంకటహరి గణపతి స్వామి వారి ఆలయ నిర్మాణ భూమిపూజ కార్యక్రమం బుధవారం నాడు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. ఆలయ నిర్మాణానికి శుభారంభం పలికే ఈ పవిత్ర వేడుకలో నాగులగుంట వీధి నివాసితులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు, హోమాలు జరిపారు. ఆలయ అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించి, విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని కృపతో ఆలయ నిర్మాణం ఎటువంటి అంతరాయాలు లేకుండా త్వరగా పూర్తికావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ ప్రాంత ప్రజలు నిత్యం పూజలు చేసుకోవడానికి, భక్తిరస కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి ఎంతో అనువుగా ఉంటుందన్నారు. ఈ పవిత్ర దైవకార్యం కోసం మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా వీధిలోని ప్రతి ఒక్కరూ అత్యంత ఉత్సాహంగా, ఐక్యంగా ముందుకు రావడం హర్షణీయమని పేర్కొన్నారు. భక్తి, ఐక్యత, మరియు పరస్పర సహకారంతో ఆలయ నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. స్వామి వారి అనుగ్రహంతో నాగులగుంట వీధి ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అర్చకులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో రామచంద్ర కూల్ డ్రింక్ షాప్ రమేష్, హరి, జయరాం, కోగిలి మునిచందు, పార్థసారథి, కేశవ, సూరి, ప్రసన్న, శారద, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

నాగులగుంట వీధిలో సంకటహరి గణపతి ఆలయ నిర్మాణానికి ఘనంగా భూమిపూజ
శ్రీ కాళహస్తి, సెప్టెంబర్ 02, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని నాగులగుంట వీధిలో నూతనంగా నిర్మించ తలపెట్టిన శ్రీ సంకటహరి గణపతి స్వామి వారి ఆలయ నిర్మాణ భూమిపూజ కార్యక్రమం బుధవారం నాడు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. ఆలయ నిర్మాణానికి శుభారంభం పలికే ఈ పవిత్ర వేడుకలో నాగులగుంట వీధి నివాసితులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు, హోమాలు జరిపారు. ఆలయ అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించి, విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని కృపతో ఆలయ నిర్మాణం ఎటువంటి అంతరాయాలు లేకుండా త్వరగా పూర్తికావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ ప్రాంత ప్రజలు నిత్యం పూజలు చేసుకోవడానికి, భక్తిరస కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి ఎంతో అనువుగా ఉంటుందన్నారు. ఈ పవిత్ర దైవకార్యం కోసం మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా వీధిలోని ప్రతి ఒక్కరూ అత్యంత ఉత్సాహంగా, ఐక్యంగా ముందుకు రావడం హర్షణీయమని పేర్కొన్నారు. భక్తి, ఐక్యత, మరియు పరస్పర సహకారంతో ఆలయ నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. స్వామి వారి అనుగ్రహంతో నాగులగుంట వీధి ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అర్చకులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో రామచంద్ర కూల్ డ్రింక్ షాప్ రమేష్, హరి, జయరాం, కోగిలి మునిచందు, పార్థసారథి, కేశవ, సూరి, ప్రసన్న, శారద, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

