ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 12 (పున్నమి ప్రతినిధి)
వెంకటాచలంలో ఎనేబుల్ ఇండియా, రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, SUPPORT ఆధ్వర్యంలో 82 మంది దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, వీల్చైర్లు, రివాల్వింగ్, కుషన్ చైర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పాల్గొని సంస్థల సేవలను అభినందించారు. 14 బ్యాచ్లలో 417 మందికి శిక్షణ అందించగా, 67 మందికి రూ.26.50 లక్షల రుణాలు అందించినట్లు తెలిపారు. దివ్యాంగుల సంక్షేమానికి తమ వంతు సహకారం కొనసాగుతుందని, ఇప్పటికే 100 మందికి బ్యాటరీ ట్రైసైకిళ్లు అందించామని, మరో 30 మందికి అందిస్తామని సోమిరెడ్డి తెలిపారు.

దివ్యాంగుల సేవలో ఎనేబుల్ ఇండియా
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 12 (పున్నమి ప్రతినిధి) వెంకటాచలంలో ఎనేబుల్ ఇండియా, రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, SUPPORT ఆధ్వర్యంలో 82 మంది దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, వీల్చైర్లు, రివాల్వింగ్, కుషన్ చైర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పాల్గొని సంస్థల సేవలను అభినందించారు. 14 బ్యాచ్లలో 417 మందికి శిక్షణ అందించగా, 67 మందికి రూ.26.50 లక్షల రుణాలు అందించినట్లు తెలిపారు. దివ్యాంగుల సంక్షేమానికి తమ వంతు సహకారం కొనసాగుతుందని, ఇప్పటికే 100 మందికి బ్యాటరీ ట్రైసైకిళ్లు అందించామని, మరో 30 మందికి అందిస్తామని సోమిరెడ్డి తెలిపారు.

