పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 12 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ నెల 14 తేదీ నుంచి 23 వరకు పది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరగనున్నాయి భక్తుల దర్శనార్థం శ్రీ భీమేశ్వర స్వామి మండపంలో ప్రత్యేక గణపతి మండపాన్ని ఏర్పాటు చేస్తున్నారు



