వినాయక చవితి సందర్భంగా జిల్లా ప్రజలకు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శుభాకాంక్షలు తెలిపారు. భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యతనిస్తూ మట్టి గణేష్ విగ్రహాలను వినియోగించాలని కోరారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.



