శ్రీ కాళహస్తి, మే 28, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి శుకబ్రహ్మ ఆశ్రమం ఆధ్వర్యంలో త్రినేత్ర వైద్యాలయ ట్రస్ట్ నిర్వహిస్తున్న భక్తకన్నప్ప కంటి ఆసుపత్రికి నెల్లూరుకు చెందిన రిటైర్డ్ టీచర్ కె. మంజీరా ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని విరాళంగా అందించారు. తన భర్త సుందరేష్ జ్ఞాపకార్థం ఉచిత కంటి ఆపరేషన్ పథకం కోసం ఈ మొత్తాన్ని ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా అందజేశారు. ఇటీవల జరిగిన ఆసుపత్రి వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంజీరా.. అక్కడ నిరుపేదలకు అందుతున్న ఉచిత కంటి వైద్య సేవలను చూసి ప్రభావితమై, రోగుల ఉపయోగార్థం ఈ విరాళాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి జనరల్ మేనేజర్ జయభారత్ గురుప్రసాద్ ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి, ఘనంగా సత్కరించారు.

త్రినేత్ర వైద్యాలయ ట్రస్ట్కు రూ. లక్ష విరాళం
శ్రీ కాళహస్తి, మే 28, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి శుకబ్రహ్మ ఆశ్రమం ఆధ్వర్యంలో త్రినేత్ర వైద్యాలయ ట్రస్ట్ నిర్వహిస్తున్న భక్తకన్నప్ప కంటి ఆసుపత్రికి నెల్లూరుకు చెందిన రిటైర్డ్ టీచర్ కె. మంజీరా ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని విరాళంగా అందించారు. తన భర్త సుందరేష్ జ్ఞాపకార్థం ఉచిత కంటి ఆపరేషన్ పథకం కోసం ఈ మొత్తాన్ని ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా అందజేశారు. ఇటీవల జరిగిన ఆసుపత్రి వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంజీరా.. అక్కడ నిరుపేదలకు అందుతున్న ఉచిత కంటి వైద్య సేవలను చూసి ప్రభావితమై, రోగుల ఉపయోగార్థం ఈ విరాళాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి జనరల్ మేనేజర్ జయభారత్ గురుప్రసాద్ ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి, ఘనంగా సత్కరించారు.

