పున్నమి ప్రతినిధి ,రామచంద్రాపురం
రామచంద్రాపురం మండలంలోని గంగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని తోక గుట్టలో వెలసిన గ్రామదేవత తోకగుట్ట గంగమ్మకు వైభవోపేతంగా ప్రత్యేక పూజలు చేసి భక్తిశ్రద్ధలతో పొంగళ్ళు పెట్టి తమ మొక్కులు చెల్లించుకున్నారు ముందుగా గ్రామస్తులు ప్రతి ఇంటికి ఒక పొంగళ్ళు చొప్పున మహిళలు ఊరేగింపుగా అమ్మవారి దేవాలయం చేరుకుని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి పొంగళ్ళు పెట్టారు అనంతరం అమ్మవారికి పసుపు కుంకుమ పూలతో విశేషంగా అలరించి అంబలి నైవేద్యం బలి నివేదనలతో తమ మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి యేటా తిరుపతి లోని తాతయ్య గుంట గంగమ్మ జాతర ను పురస్కరించుకుని మా గ్రామదేవత తోకగుట్ట గంగమ్మతల్లికి మా గ్రామంలో అందరూ కుల మతాలకతీతంగా పార్టీలకతీతంగా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్యామ్ సుందర్ రెడ్డి, తంజావూరు మధు, మనోహర్ రెడ్డి, సింగ్ హరీష్, తంజావూరు సునీల్, పెనుగొండ రాజశేఖర్, పెనుగొండ వీరభద్ర, మనోహర్, తంజావూరు రవి, వెంకటేష్ నాడారు, మనోహర్ నాడారు, ధనశేఖర్ నాడారు, బాదూరు వంశీబాల, ఠాగూర్ మహేష్, మహిళలు నీలమ్మ, సునీత,మునెమ్మ ,లక్ష్మమ్మ, గీత ,కోటమ్మ,లత, నదియా, కావ్య, దివ్య, తేజ,రూప,కళ, మౌనిక తదితరులు పాల్గొన్నారు


