Saturday, 19 September 2026
  • Home  
  • టీడీపీలో చేరిక వార్తలు అవాస్తవం – మాజీ సర్పంచ్ గొల్లూరి మొద్దు ఖండన
- అల్లూరి సీతారామరాజు

టీడీపీలో చేరిక వార్తలు అవాస్తవం – మాజీ సర్పంచ్ గొల్లూరి మొద్దు ఖండన

అరకులోయ మండలం బస్కి పంచాయతీ, గాయిబంధ గ్రామానికి చెందిన వైసీపీ నేతలు టీడీపీలో చేరారన్న వార్తల్లో వాస్తవం లేదని మాజీ సర్పంచ్ గొల్లూరి మొద్దు స్పష్టం చేశారు. బుధవారం వేరే పని నిమిత్తం టీడీపీ ఇంచార్జ్ డా.సియ్యారి దొన్ను దొర క్యాంప్ కార్యాలయానికి వెళ్లగా, తమను పిలిచి బలవంతంగా పసుపు కండువాలు కప్పి ఫోటోలు తీసి ప్రచారం చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము వైసీపీలోనే కొనసాగుతామని, కండువా వద్దని చెప్పినా వినలేదని తెలిపారు. వైసీపీలో తమకు సముచిత గౌరవం లభించిందని, జగన్, ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం వెంటే ఉంటామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాంగి నాగేశ్వరరావుతోపాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. Uploaded Video:

అరకులోయ మండలం బస్కి పంచాయతీ, గాయిబంధ గ్రామానికి చెందిన వైసీపీ నేతలు టీడీపీలో చేరారన్న వార్తల్లో వాస్తవం లేదని మాజీ సర్పంచ్ గొల్లూరి మొద్దు స్పష్టం చేశారు. బుధవారం వేరే పని నిమిత్తం టీడీపీ ఇంచార్జ్ డా.సియ్యారి దొన్ను దొర క్యాంప్ కార్యాలయానికి వెళ్లగా, తమను పిలిచి బలవంతంగా పసుపు కండువాలు కప్పి ఫోటోలు తీసి ప్రచారం చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము వైసీపీలోనే కొనసాగుతామని, కండువా వద్దని చెప్పినా వినలేదని తెలిపారు. వైసీపీలో తమకు సముచిత గౌరవం లభించిందని, జగన్, ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం వెంటే ఉంటామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాంగి నాగేశ్వరరావుతోపాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.