చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన జిల్లా ఎస్పీ, పోలీస్ అధికారులు
అనకాపల్లి, సెప్టెంబర్ 17: పున్నమి ప్రతినిధి ఆనంద్
శిల్పకళ, వాస్తుశాస్త్రం, యంత్ర సాంకేతికతకు ప్రతీక అయిన దేవశిల్పి శ్రీ విశ్వకర్మ జయంతి వేడుకలను అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్, విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… శ్రీ విశ్వకర్మను ప్రపంచ తొలి వాస్తుశిల్పిగా, నిర్మాణ శాస్త్రానికి (ఆర్కిటెక్చర్) ఆద్యుడిగా పురాణాలు అభివర్ణిస్తున్నాయని గుర్తుచేశారు. ద్వారక వంటి అద్భుత నగరాల నిర్మాణంతో పాటు దేవతల ఆయుధాలు, రథాలను తీర్చిదిద్దిన ఘనత ఆయనదేనని పేర్కొన్నారు.శ్రమజీవులందరికీ విశ్వకర్మ స్ఫూర్తిప్రదాత: కేవలం దేవతల శిల్పి మాత్రమే కాక, కష్టపడి పనిచేసే ప్రతి కార్మికుడు, శిల్పి, వడ్రంగి, ఇంజనీర్, పారిశ్రామికవేత్త వెనుక ఉన్న నిజమైన ప్రేరణ శ్రీ విశ్వకర్మ.ఆధునిక సాంకేతికతకు మార్గదర్శకం: నేటి ఆధునిక యుగంలోనూ ఆయన ప్రదర్శించిన సృజనాత్మకత, నైపుణ్యం ఎంతో ఆచరణీయం.నైపుణ్యమే విజయం: కష్టపడే తత్వం, అంకితభావం, పట్టుదల ఉంటే ఎంతటి క్లిష్టమైన పనులనైనా అద్భుతంగా సాధించవచ్చనే సందేశాన్ని విశ్వకర్మ జీవితం నేర్పుతుంది.
కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహనరావు, డీఎస్పీ శ్రీ కె.రవికుమార్, సీఐలు బాల సూర్యరావు, లక్ష్మి, అప్పలనాయుడు, శ్రీనివాసరావు, రామకృష్ణారావు, మన్మధరావు, ఏ.వో సి.హెచ్.తిలక్ బాబు తదితర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని శ్రీ విశ్వకర్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.


