ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 15 (పున్నమి ప్రతినిధి)వెంకటాచలం మండలంలోని గణేష్ గార్డెన్లో ఒకే రోజు రెండు ఇళ్లలో చోరీలు జరగడం కలకలం రేపింది. ఇంటి యజమానులు లేని సమయంలో గుర్తు తెలియని దుండగులు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి బంగారు, వెండి ఆభరణాలు దోచుకెళ్లినట్లు వెంకటాచలం ఎస్ఐ తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు పరిసర ప్రాంతాల సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు. దుండగులను త్వరలోనే గుర్తించి పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

గణేష్ గార్డెన్లో ఒకే రోజు రెండు ఇళ్లలో చోరీలు
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 15 (పున్నమి ప్రతినిధి)వెంకటాచలం మండలంలోని గణేష్ గార్డెన్లో ఒకే రోజు రెండు ఇళ్లలో చోరీలు జరగడం కలకలం రేపింది. ఇంటి యజమానులు లేని సమయంలో గుర్తు తెలియని దుండగులు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి బంగారు, వెండి ఆభరణాలు దోచుకెళ్లినట్లు వెంకటాచలం ఎస్ఐ తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు పరిసర ప్రాంతాల సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు. దుండగులను త్వరలోనే గుర్తించి పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

