*సత్యవేడు నియోజకవర్గంలో దారిద్ర్యరేఖకు దిగువనున్న ప్రతి కుటుంబం సంక్షేమాభివృద్ధి చెంది ఆర్థికంగా స్థిరపడాలని MLA ఆదిమూలం ఆకాంక్ష….*
సత్యవేడు మండలం అమాసిరెడ్డి కండ్రిగ లో క్రిస్టియన్ మిషనరీ ఆఫ్ సౌత్ ఇండియా(CMSI )ఆధ్వర్యంలో ఈరోజు నూతనంగా నిర్మించిన పేద విద్యార్థుల హాస్టల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆదిమూలమును ఉద్దేశించి… నిర్వాహకులు మాట్లాడుతూ మేము కూడా మీ పేదరికంలోనే తల్లడిల్లి దేవుడి కృపతో ఆయన చల్లని దీవెనలతో మా జీవితాల్లో వెలుగులు నిండాయని… ఆర్థిక స్తోమత లేక దారిద్ర రేఖకు దిగువనున్న కుటుంబాల జీవితాలలో వెలుగులు నింపాలంటే కేవలం విద్యా జ్ఞానమే మార్గమని భావించి అదే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఈ హాస్టల్ ప్రారంభోత్సవానికి మహా మనిషి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి భావజాలాలతో ఆయనే ఆదర్శంగా పేదల సంక్షేమాభివృద్ధికి కృషి చేస్తున్న సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం గారి చేతులు మీదుగా ప్రారంభించడం ఆనందంగా ఉందని… తెలిపారు
ఈ సందర్భంగా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ పేదరికంలో పుట్టి కష్టా నష్టాలను చూసి పెరిగి అంచలంచెలుగా ఎదిగిన బెని కుటుంబం పేదరికం పోవాలంటే భవిష్యత్తు తరాలు ఉజ్వలంగా ఉండాలంటే విద్యా జ్ఞానంతోనే అది సాధ్యమని భావించి ఇంతటి అందమైన హాస్టల్ నిరుపేద పిల్లల కోసం అన్ని సదుపాయాలతో నిర్మించి పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్న బెన్నీ కుటుంబని ప్రశంసించారు….
ప్రతి ఒక్కరూ సమాజంలో మనం పుట్టి పెరిగినందుకు సమాజం మనకు ఎంతో ఇచ్చిందని గుర్తించి తమ వంతు బాధ్యతగా ఆర్థిక స్తోమత పుష్కలంగా ఉన్నవారు సేవా కార్యక్రమాలు చేయాలని, సేవా కార్యక్రమాలు చేయాలంటే అది ఒక రంగానికే పరిమితం కాదని ప్రజాసేవ చేయాలని మనసు ఉంటే చాలుని… స్వచ్ఛంద సంస్థలు సంఘాలు రాజకీయాలు… అన్ని రంగాల నుండి ప్రజలకు సేవలు అందించవచ్చని….. అప్పుడే మనం ఉన్న గ్రామం మండలం నియోజకవర్గంలో రాష్ట్రం బాగుపడుతుందని తెలిపారు


