శ్రీ కాళహస్తి, మే 19, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక ఎన్టీఆర్ నగర్ గంగమ్మ జాతర మహోత్సవాన్ని పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సతీమణి బియ్యపు శ్రీవాణి రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఎన్టీఆర్ నగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వినాయకుని దేవాలయం నుండి అమ్మవారి సారెను తీసుకొని ఊరేగింపుగా వెళ్లి గంగమ్మ తల్లికి సమర్పించారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు ఆమెకు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివకుమార్ యాదవ్, పఠాన్ ఫరీద్, మున్నా రాయల్, యోగ, బావాజీ, సురేష్, గాంధీ, జీవీకే రెడ్డి, ప్రవీణ్, తరుణ్, అభిషేక్, మోహన్, సూర్య, కల్లి, సమీర్, బాలాజీ రెడ్డి, రెడ్డి భాష, శివ, చెంచయ్య, శీన, భాను పాల్గొన్నారు.

గంగమ్మ జాతరలో అమ్మవారిని దర్శించుకున్న బియ్యపు శ్రీవాణి రెడ్డి
శ్రీ కాళహస్తి, మే 19, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక ఎన్టీఆర్ నగర్ గంగమ్మ జాతర మహోత్సవాన్ని పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సతీమణి బియ్యపు శ్రీవాణి రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఎన్టీఆర్ నగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వినాయకుని దేవాలయం నుండి అమ్మవారి సారెను తీసుకొని ఊరేగింపుగా వెళ్లి గంగమ్మ తల్లికి సమర్పించారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు ఆమెకు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివకుమార్ యాదవ్, పఠాన్ ఫరీద్, మున్నా రాయల్, యోగ, బావాజీ, సురేష్, గాంధీ, జీవీకే రెడ్డి, ప్రవీణ్, తరుణ్, అభిషేక్, మోహన్, సూర్య, కల్లి, సమీర్, బాలాజీ రెడ్డి, రెడ్డి భాష, శివ, చెంచయ్య, శీన, భాను పాల్గొన్నారు.

