అసెంబ్లీ సమావేశాల అనంతరం కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో లక్షలాది మందితో ప్రత్యక్ష ఉద్యమం చేపడతామని మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఎర్రవల్లిలో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై చర్చకు అసెంబ్లీని కనీసం నెలరోజులు నిర్వహించాలని డిమాండ్ చేస్తామన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, రుణమాఫీ, కరెంట్ కోతలు, 22ఏ భూములు, ఉద్యోగుల పీఆర్సీ, డీఏలు, ఈహెచ్ఎస్ తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం అవసరమైతే సభను స్తంభింపజేస్తామని పేర్కొన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం లేదని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిర్ణయించినట్లు వెల్లడించారు.

కేసీఆర్ నేతృత్వంలో మహా ఉద్యమం: హరీశ్రావు
అసెంబ్లీ సమావేశాల అనంతరం కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో లక్షలాది మందితో ప్రత్యక్ష ఉద్యమం చేపడతామని మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఎర్రవల్లిలో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై చర్చకు అసెంబ్లీని కనీసం నెలరోజులు నిర్వహించాలని డిమాండ్ చేస్తామన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, రుణమాఫీ, కరెంట్ కోతలు, 22ఏ భూములు, ఉద్యోగుల పీఆర్సీ, డీఏలు, ఈహెచ్ఎస్ తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం అవసరమైతే సభను స్తంభింపజేస్తామని పేర్కొన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం లేదని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిర్ణయించినట్లు వెల్లడించారు.

