Saturday, 5 September 2026
  • Home  
  • ఏటికొప్పాక జడ్పీహెచ్ పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
- అనకాపల్లి

ఏటికొప్పాక జడ్పీహెచ్ పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

గురువే జ్ఞానజ్యోతి.. భావితరాలకు మార్గదర్శి! యలమంచిలి , సెప్టెంబర్ 5 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ఏటికొప్పాక గ్రామంలోని జడ్పీహెచ్ పాఠశాలలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు మల్ల రమణ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ ఊడి రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతదేశ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ విద్యావేత్త, తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని, ఆయన చిత్రపటానికి పాఠశాల చైర్మన్ ఊడి రామకృష్ణ గారు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. విద్యారంగానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. అనంతరం పాఠశాల చైర్మన్ ఊడి రామకృష్ణ గారు, పాఠశాల ఉపాధ్యాయులు కలిసి సీనియర్ ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు కె. అమ్మాజీ గారిని ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయ వృత్తిలో ఆమె అందిస్తున్న సేవలను అభినందిస్తూ శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు విద్యాబోధనతో పాటు క్రమశిక్షణ, విలువలు, మంచి నడవడికను నేర్పించడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని పేర్కొన్నారు. సమాజానికి ఉత్తమ పౌరులను తీర్చిదిద్దే గురువుల సేవలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమం గురువుల పట్ల గౌరవం, కృతజ్ఞతను చాటిచెప్పేలా ఉత్సాహభరితంగా సాగింది.

గురువే జ్ఞానజ్యోతి.. భావితరాలకు మార్గదర్శి!

యలమంచిలి , సెప్టెంబర్ 5 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
ఏటికొప్పాక గ్రామంలోని జడ్పీహెచ్ పాఠశాలలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు మల్ల రమణ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ ఊడి రామకృష్ణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భారతదేశ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ విద్యావేత్త, తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని, ఆయన చిత్రపటానికి పాఠశాల చైర్మన్ ఊడి రామకృష్ణ గారు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. విద్యారంగానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
అనంతరం పాఠశాల చైర్మన్ ఊడి రామకృష్ణ గారు, పాఠశాల ఉపాధ్యాయులు కలిసి సీనియర్ ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు కె. అమ్మాజీ గారిని ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయ వృత్తిలో ఆమె అందిస్తున్న సేవలను అభినందిస్తూ శాలువా కప్పి సత్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు విద్యాబోధనతో పాటు క్రమశిక్షణ, విలువలు, మంచి నడవడికను నేర్పించడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని పేర్కొన్నారు. సమాజానికి ఉత్తమ పౌరులను తీర్చిదిద్దే గురువుల సేవలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమం గురువుల పట్ల గౌరవం, కృతజ్ఞతను చాటిచెప్పేలా ఉత్సాహభరితంగా సాగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.