రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్, ఉప్పల్ శిల్పారామంలో TVG సేన ఆధ్వర్యంలో ఆత్మీయుల సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, అభిమానులు, ఆత్మీయులు పాల్గొన్నారు. కార్యక్రమంలో తూళ్ల దేవేందర్ గౌడ్, ఆయన కుమారుడు తూళ్ల వీరేందర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ అవిరేను రామ్మోహన్, BJHPS సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు దూపం అంజనేయులు వారిని ఆత్మీయంగా కలిశారు. పరస్పరం యోగక్షేమాలు అడిగి తెలుసుకుని ఆత్మీయంగా ముచ్చటించుకున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న వారంతా పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
మీ దూపం అంజనేయులు నాగులపల్లి గ్రామపంచాయతీ 3వ వార్డు మెంబర్, కోడేరు మండలం, నాగర్ కర్నూల్ జిల్లా




