Thursday, 13 August 2026

Tag: రిపోర్టర్ ఆనంద్

అనకాపల్లి

ఏటికొప్పాకకు అంతర్జాతీయ గుర్తింపు.. పర్యాటక గ్రామం కోసం భూసేకరణపై కసరత్తు

అనకాపల్లి జిల్లా, ఆగస్టు 12 (పున్నమి న్యూస్ ప్రతినిధి): యలమంచిలి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తెలిపారు. బుధవారం జడ్పీ గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏటికొప్పాక లక్కబొమ్మలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంతో పాటు కళాకారులకు మరిన్ని అవకాశాలు కల్పిస్తామన్నారు. ఏటికొప్పాకను ప్రత్యేక పర్యాటక గ్రామంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ కృష్ణన్, IASతో కలిసి ఏటికొప్పాక గ్రామాన్ని పరిశీలించి, పర్యాటక ప్రాజెక్టుకు అవసరమైన స్థలాలు, భూసేకరణ అవకాశాలను పరిశీలించినట్లు పేర్కొన్నారు. సుమారు రూ.6–7 కోట్ల అంచనా వ్యయంతో షాపింగ్ ప్రాంగణాలు, భోజనశాలలు, కళల శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అంకుడు కర్రల కొరత నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే వెల్లడించారు. Uploaded Video:

అనకాపల్లి

ఏటికొప్పాక వారపు సంత దుస్థితి.. వర్షం పడితే రైతులు, కొనుగోలుదారులకు నరకయాతనే!

యలమంచిలి , ఆగస్టు 11 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ఏటికొప్పాక గ్రామంలో ప్రతి మంగళవారం నిర్వహించే వారపు సంత చుట్టుపక్కల గ్రామాల రైతులు, ప్రజలకు ఎంతో ముఖ్యమైనది. రైతులు పండించిన తాజా కూరగాయలు, నిత్యావసర సరుకులు ఇక్కడ విక్రయిస్తుండగా, కొనుగోలుదారులు కూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అయితే సంత ప్రాంగణంలో శాశ్వత షెడ్లు, షట్టర్లు, సరైన రహదారి, డ్రైనేజీ వంటి మౌలిక వసతులు లేకపోవడంతో వర్షం పడితే మొత్తం ప్రాంతం బురదమయంగా మారుతోంది. దీంతో రైతులు సరుకులు అమ్ముకునేందుకు, ప్రజలు కొనుగోళ్లకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ, వర్షాల నుంచి రక్షణ లేక అవస్థలు తప్పడం లేదు. ఏటికొప్పాక గ్రామపంచాయతీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి వారపు సంత ప్రాంగణాన్ని అభివృద్ధి చేసి, శాశ్వత షెడ్లు, షట్టర్లు, రహదారి, డ్రైనేజీ సౌకర్యాలు కల్పించాలని రైతులు, వ్యాపారులు, గ్రామ ప్రజలు కోరుతున్నారు.

అనకాపల్లి

ఏటికొప్పాక వారపు సంత దుస్థితి.. వర్షం పడితే రైతులు, కొనుగోలుదారులకు నరకయాతనే!

యలమంచిలి , ఆగస్టు 11 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ఏటికొప్పాక గ్రామంలో ప్రతి మంగళవారం నిర్వహించే వారపు సంత చుట్టుపక్కల గ్రామాల రైతులు, ప్రజలకు ఎంతో ముఖ్యమైనది. రైతులు పండించిన తాజా కూరగాయలు, నిత్యావసర సరుకులు ఇక్కడ విక్రయిస్తుండగా, కొనుగోలుదారులు కూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అయితే సంత ప్రాంగణంలో శాశ్వత షెడ్లు, షట్టర్లు, సరైన రహదారి, డ్రైనేజీ వంటి మౌలిక వసతులు లేకపోవడంతో వర్షం పడితే మొత్తం ప్రాంతం బురదమయంగా మారుతోంది. దీంతో రైతులు సరుకులు అమ్ముకునేందుకు, ప్రజలు కొనుగోళ్లకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ, వర్షాల నుంచి రక్షణ లేక అవస్థలు తప్పడం లేదు. ఏటికొప్పాక గ్రామపంచాయతీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి వారపు సంత ప్రాంగణాన్ని అభివృద్ధి చేసి, శాశ్వత షెడ్లు, షట్టర్లు, రహదారి, డ్రైనేజీ సౌకర్యాలు కల్పించాలని రైతులు, వ్యాపారులు, గ్రామ ప్రజలు కోరుతున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.