నెల్లూరులో వాహనం బోల్తా..17 మందికి గాయాలు
నెల్లూరు, బుజబుజ నెల్లూరు సమీపంలో అశోక్ లేలాండ్ దోస్త్ వాహనం బోల్తా పడటంతో 17 మంది జార్ఖండ్ కార్మికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న కలెక్టర్ హిమాన్షు శుక్ల వెంటనే జీజీహెచ్కు చేరుకుని బాధితులను పరామర్శించారు. వైద్య సేవలను పరిశీలించి, గాయపడిన వారికి రూ.10 వేల చొప్పున, ఐసీయూ బాధితుడికి రూ.లక్ష తక్షణ సాయం అందించాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు.



