Wednesday, 19 August 2026

Tag: Ponguleti Srinivasa Reddy

హైదరాబాద్

22-ఏ భూములపై ఆందోళన వద్దు: సీఎం రేవంత్ రెడ్డి

22-ఏ నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లపై సీఎం ఎ. రేవంత్ రెడ్డి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఆన్‌లైన్‌లో స్లాట్ తీసుకున్న వారి భూమి 22-ఏ జాబితాలో ఉంటే, అది ప్రైవేటు భూమిగా నిర్ధారణ అయిన వెంటనే రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు 22-ఏ జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి తప్పులేని జాబితా రూపొందించాలని సూచించారు. ప్రైవేటు భూమిలో ఒక్క అంగుళానికీ ఇబ్బంది రానివ్వమని భరోసా ఇచ్చారు. ప్రజలు దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించవద్దని, పుకార్లను నమ్మవద్దని సీఎం స్పష్టం చేశారు. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

హైదరాబాద్

22ఏ సమస్యను నెలాఖరులోగా పరిష్కరిస్తాం: మంత్రి పొంగులేటి

22ఏ నిషేధిత జాబితాలో అధికారుల పొరపాట్ల వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సమస్య పరిష్కారానికి ఇప్పటికే చర్యలు చేపట్టామని, ఇటీవల పలు రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలను స్వయంగా పరిశీలిస్తానన్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి నెలాఖరులోగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. హరీశ్‌రావు, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్ చేశారు. ఫీనిక్స్, రాఘవ కంపెనీల మధ్య వ్యాపార లావాదేవీలపై వస్తున్న ఆరోపణలను కూడా ఆయన తోసిపుచ్చారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.