Friday, 4 September 2026

Tag: #Peddapalli #Ramagundam

పెద్దపల్లి

డయాలసిస్ పేషెంట్లకు స్రవంతి చేయూత ఆర్థిక భరోసా

గోదావరిఖని, సెప్టెంబర్ 04: అనారోగ్యంతో డయాలసిస్ చికిత్స పొందుతున్న నిరుపేద రోగులకు అండగా నిలిచేందుకు స్రవంతి చేయూత కార్యక్రమం ద్వారా ఆర్థిక సహాయం అందించారు. శుక్రవారం గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు డయాలసిస్ పేషెంట్లకు ఒక్కొక్కరికి రూపాయలు 500 చొప్పున మొత్తం రూ.1,500 ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమానికి దాతలుగా స్రవంతి చేయూత ద్వారా రూ.1000, రమేష్ ఆర్ అండ్ బి రూ.500 ఆర్థిక సహాయం అందించారు. అనంతరం ఈ మొత్తాన్ని డయాలసిస్ పేషెంట్లు హకీం భాయ్, నరేష్, మల్లేష్ లకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున అందించారు. ఆపదలో ఉన్న డయాలసిస్ రోగులకు తమవంతు సహాయం అందించడం ద్వారా మానవత్వాన్ని చాటుకున్న స్రవంతి చేయూత నిర్వాహకులు, దాతల సేవలను పలువురు అభినందించారు.

పెద్దపల్లి

డయాలసిస్ పేషెంట్లకు స్రవంతి చేయూత ఆర్థిక భరోసా

గోదావరిఖని, సెప్టెంబర్ 04: అనారోగ్యంతో డయాలసిస్ చికిత్స పొందుతున్న నిరుపేద రోగులకు అండగా నిలిచేందుకు స్రవంతి చేయూత కార్యక్రమం ద్వారా ఆర్థిక సహాయం అందించారు. శుక్రవారం గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు డయాలసిస్ పేషెంట్లకు ఒక్కొక్కరికి రూపాయలు 500 చొప్పున మొత్తం రూ.1,500 ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమానికి దాతలుగా స్రవంతి చేయూత ద్వారా రూ.1000, రమేష్ ఆర్ అండ్ బి రూ.500 ఆర్థిక సహాయం అందించారు. అనంతరం ఈ మొత్తాన్ని డయాలసిస్ పేషెంట్లు హకీం భాయ్, నరేష్, మల్లేష్ లకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున అందించారు. ఆపదలో ఉన్న డయాలసిస్ రోగులకు తమవంతు సహాయం అందించడం ద్వారా మానవత్వాన్ని చాటుకున్న స్రవంతి చేయూత నిర్వాహకులు, దాతల సేవలను పలువురు అభినందించారు.

పెద్దపల్లి

రామగుండం మండల అధ్యక్షుడిగా రేషవేని రమేష్ యాదవ్ నియామకం

పెద్దపల్లి, సెప్టెంబర్ 04: తెలంగాణ రాజ్యాధికార పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో భాగంగా రామగుండం మండల అధ్యక్షుడిగా రేషవేని రమేష్ యాదవ్‌ను నియమించారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు పార్టీ నియామక పత్రాన్ని అందించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తీన్మార్ మల్లన్న, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్ మాధం రజనీ కుమార్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా సూచనల మేరకు ఈ నియామకం చేపట్టినట్లు నాయకులు తెలిపారు. జిల్లా అధ్యక్షులు మెరుగు చందర్ యాదవ్ ఆధ్వర్యంలో రేషవేని రమేష్ యాదవ్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మెరుగు సతీష్ గౌడ్, జిల్లా సంయుక్త కార్యదర్శి కాంపెల్లి స్వామి, జిల్లా కార్యదర్శి కుమ్మరి పరమేష్, పెద్దపల్లి మండల అధ్యక్షుడు, వెంగళ కృష్ణ, మధు, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.