డయాలసిస్ పేషెంట్లకు స్రవంతి చేయూత ఆర్థిక భరోసా
గోదావరిఖని, సెప్టెంబర్ 04: అనారోగ్యంతో డయాలసిస్ చికిత్స పొందుతున్న నిరుపేద రోగులకు అండగా నిలిచేందుకు స్రవంతి చేయూత కార్యక్రమం ద్వారా ఆర్థిక సహాయం అందించారు. శుక్రవారం గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు డయాలసిస్ పేషెంట్లకు ఒక్కొక్కరికి రూపాయలు 500 చొప్పున మొత్తం రూ.1,500 ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమానికి దాతలుగా స్రవంతి చేయూత ద్వారా రూ.1000, రమేష్ ఆర్ అండ్ బి రూ.500 ఆర్థిక సహాయం అందించారు. అనంతరం ఈ మొత్తాన్ని డయాలసిస్ పేషెంట్లు హకీం భాయ్, నరేష్, మల్లేష్ లకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున అందించారు. ఆపదలో ఉన్న డయాలసిస్ రోగులకు తమవంతు సహాయం అందించడం ద్వారా మానవత్వాన్ని చాటుకున్న స్రవంతి చేయూత నిర్వాహకులు, దాతల సేవలను పలువురు అభినందించారు.




