స్థానిక ఎన్నికలకు కొత్త వ్యూహం
అమరావతిలో జరిగిన జనసేన శాసనసభాపక్ష సమావేశంలో పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేయడం అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయమని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అదే వ్యూహం వర్తించదని స్పష్టం చేశారు. జనసైనికులు, వీర మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా ముందుకెళ్తామని పేర్కొన్నారు.




