Monday, 7 September 2026

Tag: Chandrababu Naidu

గూడూరు

గూడూరులో ₹32 లక్షల సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

గూడూరు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి 28వ విడత చెక్కుల పంపిణీ జరిగింది. దాదాపు ₹32 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ లబ్ధిదారులకు అందజేశారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు CMRF భరోసాగా నిలుస్తోందన్నారు. అర్హులైన బాధితులకు సహాయం అందేలా స్థానిక నాయకులు చొరవ చూపాలని సూచించారు. గ్రామాలు, వార్డుల్లో నాయకులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు జవాబుదారీగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. Uploaded Video:

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అవ్వాతాతల ఆనందమే మా సంతోషం : మంత్రి నారాయణ

అవ్వాతాతల కళ్లలో ఆనందం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు 6వ డివిజన్ ఉడ్‌హౌస్ సంఘంలో మంగళవారం NTR భరోసా పింఛన్లను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేశారు. కూటమి ప్రభుత్వం 62 లక్షల కుటుంబాల పింఛన్ల కోసం ఏటా ₹33 వేల కోట్లు ఖర్చు చేస్తోందని, ఇప్పటివరకు ₹73,594.44 కోట్లు కేటాయించిందని తెలిపారు. వృద్ధులు, వితంతువులకు ₹4,000, దివ్యాంగులకు ₹6,000, పూర్తి వికలాంగులకు ₹15,000, కిడ్నీ, కాలేయ వ్యాధిగ్రస్తులకు ₹10,000 అందిస్తున్నట్లు చెప్పారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ కృషితో సంక్షేమం, అభివృద్ధి కొనసాగుతున్నాయన్నారు. కార్యక్రమంలో కమిషనర్ నందన్, మేయర్ దేవరకొండ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, తాళ్లపాక అనూరాధ, విజేతా రెడ్డి, కార్పొరేటర్ కిన్నెర మాల్యాద్రి, కొండా ప్రవీణ్, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.