ఘనంగా గురజాడ అప్పారావు 164వ జయంతి
విజయనగరం: మహాకవి గురజాడ అప్పారావు 164వ జయంతి వేడుకలను ఈనెల 21న ఘనంగా నిర్వహించాలని డీఆర్వో సీహెచ్. సత్తిబాబు అధికారులను ఆదేశించారు. గురజాడ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఉదయం 8:45 గంటలకు గురజాడ స్వగృహం నుంచి కాంస్య విగ్రహం వరకు ఊరేగింపు నిర్వహించి, అనంతరం “దేశమంటే మట్టి కాదోయ్” గేయాన్ని సామూహికంగా ఆలపించనున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఆర్వో కోరారు.



