రాష్ట్రంలో కొనసాగుతున్న SIR (Special Intensive Revision) ప్రక్రియలో భాగంగా క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ గడువును కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 7 వరకు పొడిగించింది. షెడ్యూల్ ప్రకారం ఈ గడువు సెప్టెంబర్ 16తో ముగియాల్సి ఉంది. అయితే మరింత సమయం అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుధర్శన్ రెడ్డికి లేఖ రాశారు. ఈ విజ్ఞప్తిని పరిశీలించిన ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించి గడువును పొడిగించింది. అనంతరం క్లెయిమ్స్, అభ్యంతరాల పరిశీలన పూర్తిచేసి నవంబర్ 9న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనుంది. గడువు పొడిగింపుతో అర్హులైన ఓటర్లు తమ వివరాలను సరిచేసుకోవడానికి, అభ్యంతరాలు నమోదు చేసుకోవడానికి మరింత అవకాశం లభించింది.

SIR గడువు పెంపు
రాష్ట్రంలో కొనసాగుతున్న SIR (Special Intensive Revision) ప్రక్రియలో భాగంగా క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ గడువును కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 7 వరకు పొడిగించింది. షెడ్యూల్ ప్రకారం ఈ గడువు సెప్టెంబర్ 16తో ముగియాల్సి ఉంది. అయితే మరింత సమయం అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుధర్శన్ రెడ్డికి లేఖ రాశారు. ఈ విజ్ఞప్తిని పరిశీలించిన ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించి గడువును పొడిగించింది. అనంతరం క్లెయిమ్స్, అభ్యంతరాల పరిశీలన పూర్తిచేసి నవంబర్ 9న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనుంది. గడువు పొడిగింపుతో అర్హులైన ఓటర్లు తమ వివరాలను సరిచేసుకోవడానికి, అభ్యంతరాలు నమోదు చేసుకోవడానికి మరింత అవకాశం లభించింది.

