జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పి శ్
Ch. సౌజన్య ప్రజల నుంచి మొత్తం 132 ఫిర్యాదులను స్వీకరించారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, మోసాలు, సైబర్ నేరాలు తదితర అంశాలపై వచ్చిన వినతులను ఆమె పరిశీలించారు. ప్రతి ఫిర్యాదును చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా క్షుణ్ణంగా విచారించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదులపై వేగవంతమైన విచారణ చేపట్టి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి పోలీసు శాఖను నిర్భయంగా సంప్రదించాలని సూచించారు.


