కొత్తగూడెం జిల్లా :ఆగష్టు 18:(పున్నమి ప్రతినిధి )::
సీతారామ, సీతమ్మ సాగర్ ప్రాజెక్టుల పురోగతి, నిధుల కేటాయింపు, చెరువుల అనుసంధానం తదితర అంశాలపై వాస్తవాలను ప్రజలకు వెల్లడించేందుకు ఆగస్టు 18న సీపీఎం ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకత్వం ప్రాజెక్టుల పరిశీలన చేపట్టనున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు తెలిపారు. స్థానిక మంచికంటి భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 15 నాటికి తుమ్మల చెరువుకు సీతారామ కాలువ ద్వారా నీటిని అందించి 7.89 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించినప్పటికీ, ఆ హామీ ఆచరణలో నెరవేరలేదని విమర్శించారు. మంత్రుల హామీలను నమ్మి నార్లు పోసుకున్న రైతులకు నిరాశే మిగిలిందన్నారు.

(C P I ఆధ్వర్యంలో సీత రామ ప్రాజెక్ట్ పరిశీలన )
కొత్తగూడెం జిల్లా :ఆగష్టు 18:(పున్నమి ప్రతినిధి ):: సీతారామ, సీతమ్మ సాగర్ ప్రాజెక్టుల పురోగతి, నిధుల కేటాయింపు, చెరువుల అనుసంధానం తదితర అంశాలపై వాస్తవాలను ప్రజలకు వెల్లడించేందుకు ఆగస్టు 18న సీపీఎం ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకత్వం ప్రాజెక్టుల పరిశీలన చేపట్టనున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు తెలిపారు. స్థానిక మంచికంటి భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 15 నాటికి తుమ్మల చెరువుకు సీతారామ కాలువ ద్వారా నీటిని అందించి 7.89 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించినప్పటికీ, ఆ హామీ ఆచరణలో నెరవేరలేదని విమర్శించారు. మంత్రుల హామీలను నమ్మి నార్లు పోసుకున్న రైతులకు నిరాశే మిగిలిందన్నారు.

