Thursday, 9 July 2026

Blog

Featured

కరోన కట్టడికి వై.కా.పా నేత కిరణ్ కుమార్ రెడ్డి ముందడుగు రెండు లక్షల రూపాయల సామగ్రి అందజేత

కరోనా కట్టడికి కిరణ్ కుమార్ రెడ్డి ముందడుగు రెండు లక్షల విలువ చేసే సామాగ్రి పంపిణీ 20-07-2020 మనుబోలు (పున్నమి ప్రతినిధి)మనుబోలు మండలం లో కరోనా వ్యాప్తి అరికట్టేందుకు మనుబోలు మండలం అక్కంపేట మాజీ సర్పంచ్ వైకాపా యువనేత నారపనేని కిరణ్ కుమార్ రెడ్డి ముందడుగువేశారు. సుమారు రెండు లక్షల విలువ చేసేపల్స్ ఆక్సిమీటర్లు ,ధర్మ మీటర్లు శానిటైజర్,మాస్కులు తహశీల్దార్ ,ఎంపిడిఓ,వెలుగు,ప్రభుత్వ ఆసుపత్రి పోలీస్ స్టేషన్ మొదలగు కార్యాలయమునకు మండలంలో గల 14సచివాలయాలకు పంపిణీ చేశారు. ఈ సంధర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే కాకాణి ఆదేశాల మేరకు కరోన ప్రత్యేక పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారు చేసిన సేవలను స్ఫూర్తిగా తీసుకొని కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రతిఒక్కరు ఎంతలే అనుకోకుండా జాగ్రత్తలు తప్పనిసరి గా పాటించాలన్నారు. కరోనా నియంత్రణ లో మండల అధికారులు ఆదర్శంగా నిలువాలన్నారు. తహసిల్దార్ మాట్లాడుతూ కరోనా ను ఎదుర్కొనాలి అంటే ప్రభుత్వం వారు మనకు ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలి అన్నారు ప్రజలందరూ పరిసర ప్రాంతాల్లో శుభ్రంగా ఉంచుకోవాలి ఎప్పటికప్పుడు చేతులను శానిటైజర్ తో శుభ్రపరచుకోవాలి అన్నారు రాబోవు రెండు నెలల్లో కరోనా తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందన్నారు అందువల్ల ప్రతి ఒక్కరూ బయటికి వచ్చేటప్పుడు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్కు ధరించాలి అని తెలియజేశారు ఏ మండలం లేనివిధంగా మనుబోలు మండలం లో కరోనా నిర్మూలనకు కిరణ్ కుమార్ రెడ్డి చేయూత మరువలేనిదన్నారు. అనంతరం వైకాపా నాయకులు కడివేటి చంద్రశేఖర్ రెడ్డి ,బొమ్మిరెడ్డి హరరగోపాల్ రెడ్డి కిరణ్ దాతృత్వాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలోవైద్యాధికారి సుబ్బరాజు వైకాపా నాయకులు దాసరి బాస్కర్ గౌడ్,చేరెడ్డి పట్టాభి రామిరెడ్డి, దాసరి మహేంద్ర వర్మ,అన్నమాల ప్రభాకర్ రెడ్డి ,గుంజి రమేష్ తులసి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Featured

పోలీసులు అధైర్యపడవద్దు అండగా నేనున్నాను: శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి

17-07-2020 మనుబోలు (పున్నమి ప్రతినిధి) నెల్లూరు జిల్లా మనుబోలుమండలం పోలీస్ స్టేషన్ నందు ఎస్సై తో సహా 11 మందికి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయిన నేపథ్యంలో శుక్రవారం నాడు సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు మనుబోలు మండల కేంద్రంలో పర్యటించి పోలీసులను అధైర్యపడవద్దని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. స్థానిక పోలీస్ క్వార్టర్స్ నందు మాస్కులు , శానిటైజర్లు పంపిణీ చేశారు. విస్తృతంగా శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టాలని , మెరుగైన సేవలు అందించాలని, అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూచెర్లోపల్లి వడ్లపూడి గ్రామంలో కూడా కరోనా నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు రక్షణ కల్పిస్తూ నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు కరోనా పాజిటివ్ విషయం తెలుసుకున్న తాను చాలా బాధపడ్డానని , చాలా దురదృష్టకరమన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నివిధాలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలో కరోనా నివారణకు అన్ని రకాలుగా సమర్ధవంతమైన చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు.ఆయన వెంట తహశీల్దార్ నాగరాజు , ఎంపీడీఓ వెంకటేశ్వర్లు ,వైద్యాధికారి సుబ్బరాజు మండల వైయస్ఆర్ సీపీ నాయకులు బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి ,కడివేటి చంద్రశేఖర్ రెడ్డి ,దాసరి భాస్కర్ గౌడ్, దాసరి మహేంద్ర వర్మ ,అన్నమాల ప్రభాకర్ రెడ్డి,కిషోర్ నాయుడు ,గుంజి రమేష్ ,కోటేశ్వరరావు గౌడ్,చల్ల రవీంద్ర తదితరులు పాల్గొన్నారు .

Featured

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

పలమనేరు, జూలై 16,2020 (పున్నమి విలేకరి): పలమనేరు నియోజకవర్గంలో పలువురు లబ్దిదారులకు గురువారం ఎమ్మెల్యే వెంకటే గౌడ తన కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించిన మొత్తం, రూ5,41,000 చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పేద, మధ్య తరగతి ప్రజలు అనారోగ్యానికి గురై ఉన్నత వైద్య పొందిన వెంటనే సీఎం సహాయనిధి నుండి ఆస్పత్రి ఖర్చులను అందించడం జరిగిందని వివిధ కారణాల చేత అనారోగ్యం పాలైన పలువురికి మంజూరు అయిన సీఎం సహాయనిధి చెక్కులను సంబంధిత లబ్ధిదారులకు అందించడం జరిగిందని ఆయన తెలిపారు.

Featured

ఆపరేషన్ ముస్కాన్ ను ప్రారంభించిన డీ ఎస్పీ మాసుం భాషా

తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం అమలాపురం డివిజన్ పరిధిలో వీధి బాలలను కాపాడేందుకు,వారికి భద్రత కల్పించి,విద్యను అందించేందుకు చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ ఫేజ్ 6 ను ఈరోజు అమలాపురం డీ.యస్.పి షేక్ మాసుం భాషా ప్రారంభించారు.అమలాపురం లో ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా డీఎస్పీ మాసుం భాషా ఆధ్వర్యంలో పట్టణ వీధుల్లో అవగాహన ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా డిఎస్పీ భాషా మాట్లాడుతూ కోవిడ్ నియంత్రణ కు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఉదయం 11 గంటల తరువాత అన్ని వ్యాపార కార్యకలాపాలు నిలిపివేయలని వ్యాపారులకు తెలిపారు.రోడ్లపై మాస్కులు ధరించకుండా తిరుగుతున్న యువకులకు కౌన్సిలింగ్ నిర్వహించి, రోడ్డు ప్రక్కన కరోనా నియంత్రణ ప్లకార్డులను ప్రదర్శింప చేశారు. లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వీధి బాలలను గుర్తించి వారికి విద్యాబుద్ధులు నేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో అమలాపురం రూరల్ సీఐ సురేష్ బాబు,అమలాపురం రూరల్ ఎస్.ఐ రాజేష్,సఖినేటిపల్లి ఎస్ ఐ భవాని మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Featured

కరోనా ను సమర్ధవంతంగా ఎదుర్కొందాం :ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి

13-07-2020మనుబోలు( పున్నమి ప్రతినిది) మనుబోలు మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేయుటకు సందర్శించి, వసతి, సదుపాయాలను పరిశీలించి, అవసరమైన అదనపు ఏర్పాట్లను అధికారులతో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు సమీక్షించారుఅనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కరోనా త్వరగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో వాటి జాగ్రత్తల కోసం కోవిడ్ సెంటర్లతో పాటు క్లినిక్ ను కూడా ఏర్పాటు చేశాము సర్వేపల్లి నియోజకవర్గంలో ని ప్రతి మండలంలో ఒక క్వారంటైన్ సెంటర్ ను మరియు వెంకటాచలం మండల కేంద్రంలో 200 పడకలతో కోవిడ్ సెంటర్ ఏర్పాటుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాము అన్నారు. వెంకటాచలం మండలం లో ఏర్పాటు చేస్తున్న కోవిడ్ సెంటర్లో గానీ మండలాల్లో ఏర్పాటు చేస్తున్న క్వారంటైన్ సెంటర్లలో సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల అవసరాలకు మాత్రమే పరిమితం చేస్తాం. అధికారులతో మాట్లాడి అన్ని అనుకూలంగా, ఎవరికీ ఇబ్బందులు లేని ప్రాంతాల్లో కోవిడ్ సెంటర్ లు ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నారు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. నియోజకవర్గంలో కోవిడ్ నియంత్రణకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం. ఎవరూ ఆందోళన చెందకుండా, కోవిడ్ సోకిన వారి పట్ల ఎటువంటి వివక్షత లేకుండా, అందరూ తగిన జాగ్రత్తలు పాటించిఅధికారులు, వైద్యులు ఇచ్చే సూచనలు, సలహాలు పాటిస్తూ, ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదనితెలియజేశారు కోవిడ్ సమయంలో ప్రభుత్వ యంత్రాంగంతో పాటు, స్వచ్చంద సంస్థలు ఎన్నో ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి. కరోనా సోకిన వ్యక్తి, కుటుంబం పట్ల వివక్షత అనేదానికి తావు ఉండకూడదు అన్నారు సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని రావడంతో, మనం కరోనా సమస్యను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాం. కరోనా సమయంలో మన నియోజకవర్గంలో చేసిన సేవా కార్యక్రమాలు రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచాయి.ముఖ్యంగామనుబోలు మండలం లో కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని శాఖల అధికారులు సిబ్బంది కృషి చేశారని అన్నారు రాబోవు రోజుల్లో అందరం కలిసికట్టుగా కరోనా వ్యాప్తి చెందకుండా కృషిచేయాలని తెలియజేశారుఎంపీడీవో ఆఫీసులో మండల పరిధిలోని సమస్యలపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని శాఖల అధికారులు ముందస్తు ప్రణాళికలతో పని చేయాలని ఆదేశించారు కోవిడ్ నియంత్రణకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు బొమ్మిరెడ్డి హర గోపాల్ రెడ్డి, కడివేటి చంద్రశేఖర్ రెడ్డి,దాసరి భాస్కర్ గౌడ్ కిరణ్ కుమార్ రెడ్డి,మనోహర్ రెడ్డి దాసరి మహేంద్ర వర్మ, గుంజి రమేష్ తహసిల్దార్ నాగరాజు ,ఎంపీడీవో వెంకటేశ్వర్లు ,ఎస్సై సూర్యప్రకాష్ రెడ్డి వివిధ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు .

Featured

ఉద్యానవనశాఖ అధికారికి జరిమానా

పలమనేరు, జులై13,2020 (పున్నిమి విలేకరి): పలమనేరు ఉద్యానవనశాఖ అధికారి శ్రీనివాసులురెడ్డికి రూ120 జరిమాన విధించినట్టు ఎస్ఐ ప్రియాంక తెలిపారు.చెన్నై- బెంగళూరు జాతీయ రహదారి అంబేద్కర్ సర్కిల్ సోమవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మాస్క్ లేకుండా ప్రయాణిస్తున్న అధికారికి జరిమాన విధించినట్టు ఎస్ఐ తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. మాస్కులు ధరించకుండా బహిరంగ ప్రదేశాలులో తిరిగే వారిపై విపత్తు నిర్వహణ చట్టం 2005 మేరకు జరిమానా విధించినట్లు చెప్పారు. ప్రభుత్వ నియమనిబంధనలను ఉల్లంగిస్తే ఎంతటి వారిపైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Featured

ప్రాణాలు తీసిన పబ్జీ గేమ్

పలమనేరు, జులై13,2020 (పున్నిమి విలేకరి):పబ్జీ గేమ్ అడవద్దని తల్లి మందలించడంతో మనస్తాపం చెందిన కొడుకు ఉరేసుకున్న సంఘటన ఆదివారం రాత్రి పలమనేరులో చోటు చేసుకుంది. పలమనేరు సీఐ శ్రీధర్ కథనం మేరకు… పలమనేరు శ్రీనగర్ కాలనీకి చెందిన ప్రకాష్ కుమారుడు శ్యామ్ శ్రీధర్ స్థానిక ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. కరోనా కారణంగా స్కూల్ తెరవకపోవడంతో ఇంట్లో స్మార్ట్ఫోన్లో నిత్యం పుబ్జి తదితర గేమ్స్ ఆడుతుండడం తో తల్లి మందలించింది.దీంతో శ్యామ్ శ్రీధర్ ఇంట్లోని ఒక గది లోకి వెళ్లి తల్లి చున్నీతో ఫ్యాన్ కొక్కికి ఉరి వేసుకున్నాడు. బిడ్డ కనిపించకపోవడంతో గదిలో చూడగా ఉరేసుకుని వేలాడుతున్న బిడ్డను చూసి వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెల్లారు,పరిస్థితి విషమంగా ఉండడంతో బాలున్ని చిత్తూరు ఆసుపత్రికి ఇక్కడి వైద్యులు రెఫర్ చేశారు,అక్కడ చికిత్సపొందుతూ బాలుడు మృతి చెందాడు. పలమనేరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Featured

ఉధృతంగా ప్రవహిస్తున్న కైగల్ జలపాతం

పలమనేరు జూలై 13 పలమనేరు నియోజకవర్గంబైరెడ్డిపల్లి మండలంలోని కైగల్ దుమకురాళ్ళు జలపాతంలో ఉదృతంగా నీరు ప్రవాహం ప్రవహిస్తోంది. కర్ణాటక లో కురిసిన భారీ వర్షాలకు నీరు వచ్చి చేరుతుంది. నీటి ప్రవాహం చూపరులకు ఎంతోగానో ఆకట్టుకుంటుంది. జిల్లాలోని ప్రఖ్యాతి గాంచిన కైగల్ నీటిప్రవాహం ప్రాంతంనికి పోలీస్ అధికారులు నిషేధం విధించడంతో పర్యాటకులు లేక వెలవెలబోతుంది. గతంలో ఇక్కడ నీటి ప్రవాహం చూడడానికి, ప్రకృతి అందాలు వీక్షించడానికి అనేక మంది మన రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా అధిక సంఖ్యలో ఎక్కువ మంది పర్యాటకులు వచ్చేవారు. అయితే ఇక్కడ దట్టమైన అడవి, నిర్మానుష్య ప్రాంతంలో ఉండటం వలన అనేక అసాంఘిక కార్యక్రమాలు జరిగాయి. భవిష్యత్తులో కూడా జరిగే అవకాశం ఉందని అధికారులు ఇక్కడ నిషేధం విధించారు. ఇక్కడ ఉదృతంగా ప్రవహిస్తున్న నీరు మన రాష్ట్రానికి ఉపయోగపడకుండా ప్రక్క రాష్ట్రామైన తమిళనాడుకు నీరు వృధాగా వెళుతుంది. ఇక్కడ ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తే సుమారు వెయ్యి ఎకరాల భూములకు నీటిని చెరువులకు సరఫరా చేసే అవకాశం ఉందని, ప్రభుత్వం స్పందించి నీటిని అడ్డుకట్ట వేయడానికి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని జిల్లా, మండల ప్రజలు కోరుతున్నారు.

Featured

ప్రభుత్వనికి చిత్తశుద్ధి లేదు – మాజీమంత్రి అమర్నాథ్ రెడ్డి

పలమనేరు, జులై12,2020 (పున్నిమి విలేకరి): హంద్రీ-నీవా సుజల స్రవంతి అంశంలో ప్రభుత్వానికి చిత్తశుధ్ధి లేదని మాజీమంత్రి అమర్నాథ్ రెడ్డి ఆరోపించారు. టిడిపి కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…అధికారం చేపట్టిన 13 నెలలుగా ఈ ప్రాజెక్టు గురించి పట్టించుకోకపోవడం బాధాకరంని ప్రజా వ్యతిరేక పాలనగా కొనసాగుతుందన్నారు. కుప్పం నియోజకవర్గాలకు చెందినటువంటి హంద్రీనీవా కాలువ పూర్తిగా రైతుల కోసం, తాగునీటి కోసం, ప్రజల శ్రేయస్సు కోసం తీసుకొచ్చిన ఈ కాలువ నిర్మాణం ఆగిపోయిందన్నారు. ఏపార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతలపై, మాట్లాడడం అతని చేతనైతే హంద్రీనీవా కాలువ తీసుకొని రావాలన్నారు.గత ప్రభుత్వ హయాంలో నిర్మాణానికి శ్రమించి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉమ్మడి మండలాల అయినా పలమనేరు,కుప్పం రైతులు ప్రజలు తాగునీటి సమస్య కోసం తీసుకోని రావడం జరిగిందని అన్నారు. నేడు ఆ కాలువ కొనసాగింపులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రామచంద్ర నాయుడు, రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ

ఖండాంతరాలకు పాకిన వెంకటగిరి ఖ్యాతి

                                 ఓ మధ్యతరగతికి చెందిన కుటుంబం హడావుడిగా పిల్లవాడిని లాక్కుంటూ కూతవేస్తున్న ట్రైన్లోకి ఎక్కి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకోవడం జరిగింది. బోగీలో సందడిగా ఉన్నప్పటికి పిల్లవాడు మాత్రం వాటిని పట్టించుకోకుండా కిటికీవైపుకి చేరిపోయాడు. ఎప్పుడూ ఓజిలి గ్రామంలోని పీతిరి గుంటలు, మట్టిగోడలు, గబ్బుకొట్టే కోట శిధిలాలు ఇదే మన పూర్వీకుల ఆనవాళ్లు అని చూపించే అమ్మమ్మ మొదటిసారి నాన్నగారి వూరికి తీసుకువెళుతుండటంతో, ఆ కుటుంబానికి చెందిన పిల్లవాడు చాలా కుతూహలంగా ఉన్నాడు. ట్రైను గూడూరు నుండి బయలుదేరి తిరుపతి వైపు వెళ్లడం సాగింది. కిటికీలోనుంచి చూస్తుంటే భూమి గుండ్రంగా తిరుగుతూ, చెట్టు పుట్ట తనను చూసి పలకరిస్తున్నట్టు ఆ పిల్లవాడు తన మొదటిసారి ప్రయాణాన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. తాము చేరవలసిన గమ్యానికి వచ్చిన వెంటనే ఆ కుటుంబ సభ్యులు రైలు దిగి స్టేషన్ బయట ఆగి ఉన్న జట్కా బండి ఎక్కారు. జట్కాబండి ప్రయాణం రైలు ప్రయాణం కంటే హాయిగా ఉన్నట్టు పిల్లవాడు తెగ ఆనందపడిపోతున్నాడు. ఎదురుగా ఆకాశాన్నంటే కొండలు, చుట్టూ పచ్చదనం, పాత పెంకుటిల్లులు, విశాల ప్రార్ధనాలయాలు, పెద్ద పెద్ద కోటలు, ఇవన్నీచూస్తుంటే పిల్లవాడికి అమ్మమ్మ చెప్పిన రాజు కథల్లో లాంటి వాతావరణ ఇక్కడ కనిపిస్తుంటే, ఎదో ఇంకొక దేశంలో ఉన్నట్టు ఆ పిల్లవాడు సంబరపడిపోసాగాడు. అక్కడి మనుషుల తీరు, ఆప్యాయత, కలుపుగోలుతనం, భారతదేశమంటే ఇదేనేమో నన్న భావన ఆ చిన్నవాడిలో బలంగా నాటుకుపోయింది. అది మొదలు పదేపదే ఆ వూరికి వెళ్లిన, తరువాత కొంతకాలం అక్కడే స్థిరపడిన, తాను చిన్నవాడిగా ఉన్నప్పుడు చూసిన ఆ సుమధుర దృశ్యకావ్యం తన స్మృతిపధంలో చెరపలేని ముద్రవేసింది. చిన్నపిల్లాడిగా ఈ వ్యాస రచయితకు అక్కడ అడుగుపెట్టినప్పుడు కలిగిన అనుభూతి అత్తరు సువాసనల వలె శరీరంలో ఇంకిపోయింది. తర్వాత ఎందరో ఈ పెక్యులియర్ ప్రాంతానికి వచ్చి తామనుభవించిన అనుభూతుల సజీవ సాక్ష్యాలకు అక్షర రూపమివ్వడం జరిగింది. ఆ ప్రాంతం మరేదోకాదు, ఆతిథ్యసత్కారాలకు, వైభవాలకు నెలవైన వెంకటగిరి గడ్డ అది. మద్రాస్ ప్రెసిడెన్సీ ఏర్పడక ముందే దక్షిణభారతంలో దేదీప్యమానంగా ఓ వెలుగు వెలిగిన వేంకటగిరి ప్రాంతమది, వెలమల కంచుకోటగా, సువిశాల భూభాగంతో ఎనలేని సంపదతో అలరాలిన వెలుగోటి వారి స్థావరంగా, కాలక్రమంలో ఎన్నో ఆటుపోట్లను చవిచూసి నేటికీ చిరస్థాయిగా నిలిచి ఉన్న ప్రాచీన రాచరిక వైభవం వెంకటగిరి సొంతం. ఈ వ్యాస రచయితే కాదు ఎందరో మహానుభావులు, కవులు, రాజులు, దేశ విదేశీయులు, అధికారులు, ఒక్కరేంటి ప్రతి ఒక్కరూ వెంకటగిరి ఆతిధ్యాన్ని పొందినవారే. ఇలాంటి సహజ నేపథ్యం కలిగిన వెంకటగిరికి 1888 లో సందర్శించిన లార్డ్ కన్నెమెరా, వెంకటగిరి వైభవాన్నిచూసి “ వెంకటగిరి ప్రాంతం బ్రిటీషువారి అధీనంలో ఉందా, బ్రిటిషువారే వెలుగోటివారి పాలనలో ఉన్నారా “ అని ఆశ్యర్యానికి గురవుతాడు. అక్కడి స్వాగత సత్కారాలకు ముగ్ధుడైన లార్డ్ కన్నెమెరా వ్యక్తిగత సహాయకుడు రీస్ తన వెంకటగిరి అనుభవాలను ఇంగ్లాండ్ పత్రిక అయిన ది మార్నింగ్ పోస్ట్ లో రాయడం జరిగింది. ఇతర విదేశీ పత్రికలు సైతం వారి అనుభవాల్ని వెంకటగిరి ప్రాంత వైభవాన్ని విశేషంగా ప్రచురించాయి. కన్నెమెరా బృందం యొక్క భారతదేశ పర్యటనలో భాగంగా 1888, నవంబర్ 13 వ తేదీన నెల్లూరు నుంచి ప్రత్యేక రైలులో వెంకటగిరిలో దిగిన బ్రిటిషువారికి అఖండ స్వాగతం లభించింది. రీస్ మాటలలో…..                                                 మొదటగా ఎత్తయిన కోటల్లాంటి అంబారీలతో ఏనుగులు, చుట్టూ ప్రజలతో రద్దీగా ఉన్న వీధుల గుండా నెమ్మదిగా ఊరేగింపుగా కదిలాయి, అంబారీలన్నీ ఒకే స్థాయిలో ఉన్నాయి. ఇళ్ళ పై అంతస్తులన్నితెలుపు మరియు రంగురంగుల వస్త్రాలు ధరించిన వ్యక్తులతో నిండిపోయి ఉన్నాయి. గుర్రాలపై స్వాగత బ్యానర్లు మోస్తు కొందరు వూరేగింపుకు నాయకత్వం వహిస్తున్నారు. వారి తరువాత నీలం తెలుపు రంగుల యూనిఫాం ధరించిన అశ్వికదళ బృందం, తరువాత అందమైన అమ్మాయిలు నృత్యం చేస్తూ సిగలో మల్లెల వాసనతో, బంగారపు వస్త్రాలతో మెరిసిపోతూ నృత్యం చేయసాగారు. వెనుకనే జాపత్రి మోసుకొంటూ కొందరు, ఈటెల ధారణతో మరి కొందరు, దివిటీలు చేతపట్టుకొని గుర్రాలపై వరుసగా వస్తున్నారు. గుర్రాలన్ని బంగారు వస్త్రాలతో మెరిసిపోతున్నాయి. వీటితోపాటు కొన్ని బంగారు మరియు వెండి పల్లకీలు మోస్తూ వెంట వస్తున్నాయి. సంగీతకారుల బృందం ఒంటెలపై డ్రమ్స్ వాయిస్తు, మెరిసే స్టార్‌లైట్ కింద ఆడుతుండగా, ఆ ప్రాంతమంతా తాళాలు తప్పెట్లతో మారుమోగాయి. పొడుగాటి ఇత్తడి కొమ్ముల ధ్వని ఘీంకారాలతో, బాకాల గర్జనలతో వీధులన్నీదద్దరిల్లాయి, అపారమైన పొడవు, పరిమాణం కలిగిన బాకాలు జెరిఖో (పాలస్తీనాలోని పురాతన పట్టణం) గోడలతో పోటీపడుతున్నాయి. ప్రధాన వీధిలో బల్లెములతో నిండియున్నసైనికులు వరుసగా నిలబడి వున్నారు. వారిచేతిలో అత్యంత పొడవైన బరిసెలు కన్పిస్తున్నాయి. ఇవి అంబారీల ఎత్తుతో పోటీ పడుతున్నాయి. వీధులన్ని చదునైన ఇళ్లతో ఉండి పైకప్పులలో కిక్కిరిసిన జనాభా కలిగి ఉన్నారు. వీధికిరువైపులా చింతచెట్లు, వాటివెనక పర్వతాల మధ్య మెరుస్తున్న వెంకటగిరి యొక్క గొప్ప నిధి శిఖరం (దుర్గం), వీరి అనాగరిక ఆడంబరం మరియు వైభవం యొక్క దృశ్యాన్ని ప్రతిబింబిస్తుందని చెపుతూ బ్రిటిషువారికున్న సహజ అసూయను వెళ్లగక్కుతాడు. ఈ రోజుల్లో తూర్పుప్రాంతాన అత్యంత అరుదుగా కనిపించే ఈ ఆడంబరం, పురాతన కాలంనుంచి యోగ్యతగా చెలామణి అవుతున్నట్టు చెప్పుకువచ్చాడు.                                               ‘బ్రహ్మాండమైన’ వారి వైభవానికి చిహ్నంగా భారీ ఏనుగుపై రాజు (రాజగోపాలకృష్ణ యాచేంద్ర) గొప్పగా కూర్చొని ఉన్నాడు. గవర్నర్‌తో కలిసి ఉన్నరాజు తన కిరీటంలో కోడి గుడ్డు సైజు కలిగిన పెద్ద ఎమెరాల్డ్ ధరించి ఉన్నాడు. అతని సోదరులు క్రాస్బెల్టులు ధరించి, విలువైన రాళ్లతో కప్పబడిన కత్తులు కలిగిఉన్నారు. మార్మిక సంకేతంతో ఏనుగులు పూర్తిగా మత్తులోకి ప్రవేశించి నెమ్మదిగా, గత వైభవానికి నిదర్శనంగా, మనోహరమైన నడకతో నడుస్తున్నాయి. తెలుగు సాహిత్యంలో రాయబడిన స్త్రీల వయ్యారపు నడక మాదిరి, ఏనుగులు లయబద్దంగా నడుస్తున్నట్టు రీస్ చెప్పాడు. రాజు (రాజగోపాలకృష్ణ యాచేంద్ర) అత్యంత విలువైన గొప్ప ఆభరణాలను ధరించి ఉన్నాడు. కొన్నిసంవత్సరాల క్రితం అతని తండ్రి (కుమారయాచమ నాయకుడు) స్వచ్ఛందంగా తన వద్ద ఉన్నఅన్ని ఆస్తులను కుమారుడికి ఇచ్చి, తాను మాత్రం మతపరమైన కార్యక్రమాల్లోనిమగ్నమైనాడని రీస్ తెలిపాడు. (కుమార యాచముడి స్వచ్చంద పదవీత్యాగం పై చరిత్రకారుల్లో పలురకాల అభిప్రాయాలున్నప్పటికీ అవి అప్రస్తుతం ) అతని పెద్ద కుమారుడు, మా హోస్ట్ అయిన రాజు తన చిన్నతనంలోనే ఎస్టేట్ ని విజయవంతంగా నిర్వహిస్తు వెంకటగిరి నికర ఆదాయం సంవత్సరానికి 40,000 పౌండ్లను పెంచాడని, రాజు స్వభావం అతని నడవడిక మరియు మర్యాదలు ఒకే విధంగా సరళంగా మరియు సూటిగా ఉన్నాయని రాజగోపాలకృష్ణ యాచేంద్రను ప్రశంసించడం జరిగింది. ఇతని పరిపాలనలో అద్దెదారుల ఆర్ధిక పరిస్థితి చాలా బాగున్నట్టు రీస్ పేర్కొన్నాడు.                                       మా ప్రభుత్వ అజమాయిషీలో కానీ లేక బయటకాని మరెక్కడకాని మేము విన్నదానికంటే వెంకటగిరి మెరుగ్గా ఉందని రీస్ చెప్పుకొచ్చాడు. ఇలా దక్షిణ భారతదేశంలో అన్ని ప్రాంతాలు పర్యటించిన బ్రిటిషు బృందానికి ఆతిధ్య సత్కారంలో వెంకటగిరికి మరేదీ సాటిరాదని రీస్ తన అభిప్రాయాల్ని ఆంగ్లపత్రికల్లో రాయడం అతిశయోక్తి కాదని చెప్పవచ్చు. లార్డ్ కన్నెమెరా తర్వాత ఎందరో బ్రిటిషు గవర్నర్లు వెంకటగిరికి రావడం పోవడం జరిగింది. బ్రిటిషు అధికారులు వెంకటగిరిని ప్రత్యేక దృష్టితో చూడగా, ఇంగ్లాండ్లోని పత్రికలైతే వెంకటగిరిని ఓ రాష్ట్రంగా భావించి వెంకటగిరిలో చీమ చిటుక్కుమన్న తమ పత్రికల ద్వారా స్పందించేవారు. వెంకటగిరి రాజులు కూడా బ్రిటిషువారితో అంతే భయభక్తులతో ఉండేవారు. స్వదేశీ సంస్థానాల రద్దు వరకు వీరి మైత్రి కొనసాగింది.   

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.